Ukraine- russia: రష్యా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ దాడులు
Ukraine- russia: రష్యా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ దాడులు"
Play all audios:
ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తత మరోసారి తారస్థాయికి చేరింది. రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ పెద్ద ఎత్తున డ్రోన్ దాడులకు తెగబడింది. మాస్కో: ఉక్రెయిన్, రష్యా
(Ukraine-Russia) మధ్య ఉద్రిక్తత మరోసారి తారస్థాయికి చేరింది. రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ పెద్ద ఎత్తున డ్రోన్ దాడులకు తెగబడింది. ఇంత భారీ మొత్తంలో ఉక్రెయిన్ దాడులకు
పాల్పడటం ఇదే తొలిసారి. తూర్పు సైబీరియా సరిహద్దులోని సైనిక స్థావరాలే లక్ష్యంగా సుదీర్ఘంగా ప్రయాణించ గలిగే డ్రోన్లను కీవ్ ప్రయోగించింది. ఉక్రెయిన్ దాడి చేసినట్లు రష్యాలోని ఇర్కుట్స్ గవర్నర్
ధ్రువీకరించారు. ఆ దేశానికి చెందిన రిమోట్ పైలట్ ఎయిర్క్రాఫ్ట్ తమ మిలటరీ యూనిట్ను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఒలెన్యా, బెలయా సహా నాలుగు మిలటరీ ఎయిర్బేస్లపై దాడులు జరిగినట్లు
వెల్లడించారు. కీవ్ మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ చేపట్టిన ఆపరేషన్లో 40కి పైగా రష్యన్ ఎయిర్క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయి. ఇందులో టీయూ-95, టీయూ-22ఎం3
బాంబర్లు, కీలకమైన ఏ-50 ఎయిర్ క్రాఫ్ట్ కూడా ధ్వంసమైనట్లు సమాచారం. ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఇంత భారీ మొత్తంలో ఉక్రెయిన్ దాడులకు తెగబడటం ఇదే తొలిసారి. దాడికి సంబంధించిన వీడియోలు
రష్యా మీడియాలో ప్రసారమయ్యాయి. రష్యా వద్ద అపారమైన క్షిపణి సంపద ఉంది. ఆ దేశంతో పోలిస్తే ఉక్రెయిన్ దగ్గర భారీ ఆయుధాలు లేవు. దీంతో రిమోట్ సాయంతో సుదీర్ఘంగా ప్రయాణించగలిగే డ్రోన్ల వ్యవస్థను
అభివృద్ధి చేసుకుంది. గతంలోనూ రష్యా సైనిక స్థావరాలు, చమురు బావులపై దాడులు చేసేందుకు వీటిని ప్రయోగించింది. చర్చలకు ఆహ్వానించిన రష్యా తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్తో చర్చలకు రష్యా
పిలుపునిచ్చింది. ఇస్తాంబుల్లో సోమవారం ఇరుదేశాల నేతలు సమావేశమవ్వాలని కోరింది. రష్యా ప్రతిపాదనలకు ఉక్రెయిన్ అంగీకరించింది. మంత్రి రుస్టెమ్ ఉమెరోవ్ నేతృత్వంలోని బృందం సోమవారం ఇస్తాంబుల్కు
చేరుకుంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు.
Trending News
Rohit sharma: ఓ ఎజెండా ప్రకారమే భారత్లో క్రికెట్ కామెంట్రీ: రోహిత్ వ్యాఖ్యలుఇంటర్నెట్ డెస్క్: భారత్కు చెందిన పలువురి క్రికెట్ కామెంట్రీపై రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడ...
Ap news: ఏపీ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులుపిఠాపురంలో రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో స...
Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..Russia | ఇంటర్నెట్డెస్క్: రష్యాలోని బ్రయాన్స్క్లో వంతెన కూలి రైలు బోల్తాపడిన ఘటన చోటు చేసుకుని 24 గంటలు గడవక ముందే.. అ...
Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలిమరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...
Archana Udaranga – MediumTOP 10 TYPESCRIPT TIPS TODAY I’M GOING TO DISCUSS THE TOP 10 TYPESCRIPT TIPS EVERYONE SHOULD KNOW BEFORE TYPESCRIPT PROG...
Latests News
Ukraine- russia: రష్యా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీ దాడులుఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తత మరోసారి తారస్థాయికి చేరింది. రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ పెద్ద ఎత్...
Paralympics: పారాలింపిక్స్లో ఆ పతకం పోయింది.. వినోద్ కుమార్ను అనర్హుడిగా ప్రకటించిన నిర్వాహకులుPublished by: Last Updated:August 30, 2021 4:26 PM IST పారాలింపిక్స్ డిస్కస్ త్రో ఎఫ్53 కేటగిరిలో ఆదివారం కాంస్య సాధించి...
Ys sharmila: ట్యూషన్ తీసుకుంటున్న షర్మిల.. తగ్గేది లేదంటున్న వైఎస్ఆర్ కూతురుLast Updated:March 02, 2021 5:09 PM IST YS SHARMILA: తెలంగాణ రాజకీయాల్లో రాణించాలని భావిస్తున్న వైఎస్ షర్మిల.. కేసీఆర్ ...
దసరా సీజన్లో ప్రకటనలు ఇస్తున్నారా... అయితే అలర్ట్Reported by: Published by: Last Updated:October 18, 2023 7:06 AM IST దసరా సీజన్లో ప్రకటనలు ఇస్తున్నారా? అయితే జాగ్రత్తగ...
మన రెవాలో ‘చైనా’న్యూఢిల్లీ: ఇండియాలో ఏర్పాటు చేసిన పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టుల్లో ఒకటైన రెవాను భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం...