Tirumala: తిరుమలలో భద్రత బలోపేతంపై డీజీపీ, తితిదే ఈవో ఉన్నత స్థాయి సమావేశం

Eenadu

Tirumala: తిరుమలలో భద్రత బలోపేతంపై డీజీపీ, తితిదే ఈవో ఉన్నత స్థాయి సమావేశం"

Play all audios:

Loading...

తిరుమల: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తిరుమలలో భద్రత బలోపేతంపై ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, తితిదే ఈవో జె.శ్యామలరావు సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. శుక్రవారం


తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో తిరుపతి ఎస్పీ, తితిదే ఇన్‌ఛార్జ్‌ సీవీఎస్‌వో హర్షవర్ధన్‌ రాజు భద్రతా అంశాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.  అనంతరం డీజీపీ


మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో తిరుమలకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం అవసరమని తెలిపారు. ఏపీఎస్పీ, డీఏఆర్‌, ఎస్పీఎఫ్‌, హోంగార్డు, సివిల్‌ పోలీసులు,


తితిదే సెక్యూరిటీతోపాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలకు స్థిరమైన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌


ప్రొసీజర్‌ రూపొందించాలన్నారు. అలిపిరి వద్ద బహుళ స్థాయి వాహన తనిఖీ వ్యవస్థ, డిఫెన్స్‌ ఏజెన్సీలతో కలిసి సెన్సార్‌ ప్లే సిస్టమ్‌, ఆధునిక భద్రతా పరికరాలు, సైబర్‌ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం


వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.  తితిదే ఈవో జె. శ్యామలరావు మాట్లాడుతూ.. భద్రతపై అనుబంధ ఏజెన్సీలతో ఒక సమన్వయ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. తిరుమలలో సైబర్‌ భద్రతా వ్యవస్థను మరింత


బలోపేతం చేయాలని పేర్కొన్నారు. విస్తృతస్థాయిలో తిరుమల భద్రతపై సమీక్ష నిర్వహించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్‌ డీజీ(లా అండ్‌ ఆర్డర్‌) సుధాకర్‌రెడ్డి, అడిషనల్‌ డీజీ


(ఇంటెలిజెన్స్‌) మహేశ్‌ చంద్ర లద్దా, అనంతపురం రేంజ్‌ డీఐజీ డా.శేముషి, ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, తితిదే అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Trending News

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

Army: ఆర్మీ యూనిఫామ్‌ అక్రమ తరలింపు.. మిలిటరీ ఇంటెలిజెన్స్‌ సాయంతో దాడులు..

ఇంటర్నెట్‌డెస్క్‌:  సైన్యానికి యుద్ధ రంగంలో ఉపయోగపడేలా ప్రత్యేకంగా డిజిటల్‌ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన యూనిఫామ్‌లను ప...

Jahnvi kapoor: జాన్వీని విపరీతంగా ట్రోల్‌ చేశారు కానీ.. : దర్శకుడు వ్యాఖ్యలు

జాన్వీకపూర్‌ (Jahnvi kapoor)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్‌ దర్శకుడు. ఆమెను ఎంతోమంది ట్రోల్‌ చేశారని అ...

Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత.. ఆ ప్రచారం ఫేక్‌

శ్రీవారి మెట్టు మార్గంలో ఆదివారం ఉదయం చిరుత సంచరించిందనే వార్తలు అవాస్తవమని అటవీ శాఖ ఎఫ్ఆర్‌వో దొరైస్వామి తెలిపారు. తిరు...

Latests News

Tirumala: తిరుమలలో భద్రత బలోపేతంపై డీజీపీ, తితిదే ఈవో ఉన్నత స్థాయి సమావేశం

తిరుమల: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తిరుమలలో భద్రత బలోపేతంపై ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, తితిదే ఈ...

Top ten news @ 5pm: ఈనాడు. నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5pm (nov 17)

1. ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు: మంత్రి పొన్నం తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ) వాహనాలకు రిజిస్ట్రే...

Indw vs slw: ముక్కోణపు సిరీస్ ఫైనల్.. దంచేసిన భారత బ్యాటర్లు.. శ్రీలంక ముందు భారీ టార్గెట్

కొలంబో: మహిళల వన్డే ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌లో భారత్, శ్రీలంక తలపడుతున్నాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్‌ఇండియ...

Anil chauhan: పాక్‌ చైనాపై ఆధారపడితే.. భారత్‌ సొంతంగా నిలదొక్కుకుంది: సీడీఎస్

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయంగా బలోపేతం చేసుకున్న వ్యవస్థలతోనే ఆపరేషన్‌ సిందూర్‌ (operation sindoor) చేపట్టామని సీడీఎస్‌ అని...

Nita ambani: బనారసీ చీరలో మెరిసిన నీతా అంబానీ

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ‘స్వదేశ్‌’ ప్రోత్సహించే అనేక కళారూపాల్లో బనారసీ నేత ఒకటి. తాజాగా నీతా అంబానీ (Nita Ambani) బనారసీ చీ...

Top