Ap news: హంద్రీనీవాపై బహిరంగ చర్చకు సిద్ధమా..? : వైకాపా నేతలకు కాలవ శ్రీనివాసులు సవాల్
Ap news: హంద్రీనీవాపై బహిరంగ చర్చకు సిద్ధమా..? : వైకాపా నేతలకు కాలవ శ్రీనివాసులు సవాల్"
Play all audios:
రాయదుర్గం: హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పురోగతిలో ఏ ప్రభుత్వ పాత్ర ఎంతో నిగ్గుతేల్చడానికి బహిరంగ చర్చకు రావాలని వైకాపా నేతలకు ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సవాల్
విసిరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఉన్నఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారని మండిపడ్డారు. ‘‘ప్రజాప్రతినిధులుగా
జిల్లాలో అనేక పదవులు చేపట్టి, నీటిపారుదలపై అవగాహన ఉన్న వైకాపా నేతలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శివరామిరెడ్డిలు వారి పాలనలో ఏం చేశారో చెప్పగలరా? 2014 నుంచి ఇప్పటి వరకు ఏ
ప్రభుత్వంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? జరిగిన అభివృద్ధి ఎంత అనే విషయంపై బహిరంగ చర్చలో వివరించడానికి మేం సిద్ధం. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమకు రావాల్సిన నీటిని
పూర్తిగా ఇవ్వకుండా ప్రజలను నిలువునా ముంచేశారు. అనంతపురం జిల్లా భవిష్యత్తును సర్వనాశనం చేసిన వైకాపా నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోయారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత వైకాపా
పాలనలో ఆగిన పనులు మళ్లీ వేగం అందుకున్నాయి. ఆ మహానుభావుడి చలవతోనే హంద్రీనీవాకు రూపకల్పన రాయలసీమ దత్తపుత్రుడు దివంగత ఎన్టీఆర్ ఆలోచన నుంచే హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు పుట్టుకొచ్చాయి.
రాయలసీమకు శాశ్వత ప్రాతిపదికన కృష్ణ జలాలు తరలించడానికి ఆ రోజుల్లో ఆయన చేసిన కృషితోనే ఆ రెండు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయి. ఆయన స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు మాల్యాల నుంచి జీడిపల్లి
రిజర్వాయర్ వరకు 216 కి.మీ వరకున్న కాలువ ద్వారా 3,850 క్యూసెక్కుల నీటి సరఫరాకు అనుగుణంగా కాలువ పనులు చేపట్టారు. ఇటీవల ఉరవకొండ పర్యటనలోనే సీఎం జులై 10నాటికి నీటిని విడుదల చేస్తామని
ప్రకటించారు. తొలిదశలో భాగంగా చేపట్టిన పనుల ద్వారా జిల్లాలోని ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలకు సాగు, లక్షల మందికి తాగు నీరు అందుతుంది. రాయదుర్గం
నియోజకవర్గం పరిధిలోని ఆవులదట్ల, మాల్యం బ్రాంచ్ కాలువల పరిధిలో దాదాపు 35వేల ఎకరాలతోపాటు బీటీపీకి కృష్ణా జలాల తరలింపుతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది’’అని శ్రీనివాసులు తెలిపారు.
Trending News
duduku | TechCrunchSAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...
కరోనా సెకండ్ వేవ్ వస్తోందిబుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోందని, ఇప్పటికే...
వేలి ముద్రలు పడకపోయినా రేషన్సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రేషన్ సరుకులు తీసుకొనే క్రమంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న వేలి ముద్రల సమస్యను పరి...
Pm modi: ‘నోరు జారొద్దు’.. భాజపా నేతలకు మోదీ హితవుబహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు నేతలు సంయమనంతో వ్యవహరించాలని, అనవసర వ్యాఖ్యలు చేయొద్దని ప్రధాని మోదీ సూచించినట్లు తెలిసింది....
అయోధ్య రాముడి బ్యాంక్ బ్యాలెన్స్ తెలిస్తే షాక్ అవుతారు.. ఆలయానికి 900 కోట్లు ఖర్చు.. ఎంత మిగిలిందంటే..?CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Latests News
Ap news: హంద్రీనీవాపై బహిరంగ చర్చకు సిద్ధమా..? : వైకాపా నేతలకు కాలవ శ్రీనివాసులు సవాల్రాయదుర్గం: హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పురోగతిలో ఏ ప్రభుత్వ పాత్ర ఎంతో నిగ్గుతేల్చడానికి బహిరంగ చర్చకు రావాలని వైకాపా నేత...
Ntr: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలుఇంటర్నెట్డెస్క్: సౌదీ అరేబియాలో ఎన్టీఆర్ (NTR) సినీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ‘సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య’ ఆధ్...
Lucifer review: దుర్మార్గుడికి మహా దుర్మార్గుడికీ జరిగే యుద్ధం.. ‘లూసిఫర్’‘అనగనగా ఒక రాజ్యంలో ఒక మహారాజు ఉండేవాడు. ఆ రాజుకి పిల్లలు ఉండేవారు. పెద్ద సైన్యమూ ఉండేది. ఆయన్ను పొగడడానికి వందీమాగధులు ...
ఎవరీ శ్రీపాద వల్లభ?.. ఆయన పేరును పవన్కళ్యాణ్ ఎందుకు ప్రస్తావించారు?పవన్ కళ్యాణ్ ప్రస్తావించినది... శ్రీపాద శ్రీ వల్లభ స్వామి గురించే. ఆయన క్రీస్తు శకం 1320లో పుట్టి.. 1351లో అంతర్దానం అయ్...
Rajamouli: రాజమౌళిని ఆటపట్టించిన రామ్చరణ్- ఎన్టీఆర్: ‘ఆర్ఆర్ఆర్ 2’పై స్పందించిన దర్శకుడురాజమౌళిని రామ్చరణ్, ఎన్టీఆర్ ఆటపట్టించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. అందులోనే.. ‘ఆర్ఆర్ఆర్ 2’పై స్పందించారు...