Pm modi: ‘నోరు జారొద్దు’.. భాజపా నేతలకు మోదీ హితవు
Pm modi: ‘నోరు జారొద్దు’.. భాజపా నేతలకు మోదీ హితవు"
Play all audios:
బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు నేతలు సంయమనంతో వ్యవహరించాలని, అనవసర వ్యాఖ్యలు చేయొద్దని ప్రధాని మోదీ సూచించినట్లు తెలిసింది. ఇంటర్నెట్ డెస్క్: భాజపాలో కొందరు నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర
దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇటువంటి వాటిపై ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు నేతలు సంయమనంతో వ్యవహరించాలని, అనవసర వ్యాఖ్యలు
చేయొద్దని సూచించినట్లు తెలిసింది. ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సూచన చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మధ్యప్రదేశ్, హరియాణాకు
చెందిన భాజపా నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి మీడియాకు వివరాలను వెల్లడించిన కర్నల్ ఖరేషీని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా
వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనపై కేసు నమోదైంది. అనంతరం ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లగా.. సర్వోన్నత న్యాయస్థానం కూడా మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది
మరవకముందే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జగదీశ్ దేవడా కూడా సైన్యాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా హరియాణాకు చెందిన భాజపా రాజ్యసభ ఎంపీ రామ్చందర్ జాంగ్రా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..
పహల్గాంలో భర్తలను కోల్పోయిన మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆ మహిళలకు ధైర్యం, పోరాటస్ఫూర్తి ఉంటే మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండేదన్నారు. ఇలా భాజపా నేతలు చేసిన
వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ.. వివాదాస్పద వ్యాఖ్యల ధోరణికి దూరంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది.