Putin - trump: ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు సిద్ధం: ఫోన్‌లో మాట్లాడుకున్న ట్రంప్‌, పుతిన్‌

Eenadu

Putin - trump: ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు సిద్ధం: ఫోన్‌లో మాట్లాడుకున్న ట్రంప్‌, పుతిన్‌"

Play all audios:

Loading...

మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) దాదాపు 2 గంటలపైనే ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధం


(Russia-Ukraine Conflict) ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తెలిపారు. ఇటీవలే టర్కీలో రెండు దేశాల మధ్య నేరుగా చర్చలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.  ‘‘రష్యా ఒక శాంతి


ఒప్పందం కోసం ఉక్రెయిన్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో అంగీకరించాము. అయితే శాంతి స్థాపనకు సంబంధించి పలు నియమాలు ఉన్నాయి. అందులో ఈ ఒప్పందం ఎప్పటికి


జరగవచ్చో వంటి అంశాలు సైతం ఉన్నాయి’’ అని రిపోర్టర్లతో పుతిన్‌ పేర్కొన్నారు. శాంతి స్థాపన పురోగతికి కాల్పుల విరమణ ఒప్పందం నిబంధనలు సైతం నిర్ణయించాల్సి ఉంటుందని పుతిన్‌ తెలిపారు. అందులో దాని


వ్యవధి ఉంటుందన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌, దాని మిత్రదేశాలు తక్షణమే 30 రోజుల పాటు కాల్పులు విరమణ చేయాలని రష్యాను కోరాయి.  రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభానికి మద్దతు


ఇచ్చినందుకు ట్రంప్‌నకు పుతిన్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. శాంతి స్థాపన పురోగతికి పలు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ రష్యా నిబద్ధతను ట్రంప్‌ అంగీకరించినట్లు పుతిన్‌ తెలిపారు. ప్రస్తుతం


ఇరుదేశాల మధ్య చర్చలు సరైన దిశలోనే సాగుతున్నట్లు పుతిన్‌ తెలిపారు. అయితే శాంతి స్థాపన అనేది సంఘర్షణలకు మూల కారణాలను పరిష్కరించడంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇరుదేశాల్లో శాంతి కోసం ఉత్తమమైన


మార్గాలను వెతకడం ప్రస్తుతం ముఖ్యమని పేర్కొన్నారు.  ఈ ఫోన్‌ కాల్‌ అనంతరం ట్రంప్‌ స్పందించారు. రష్యా, ఉక్రెయిన్‌లు తక్షణమే కాల్పుల విరమణ చర్చలు ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా


అధ్యక్షుడితో ఫోన్‌ కాల్‌ అద్భుతంగా సాగినట్లు తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పంద అంశం పురోగతిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యూరోపియన్‌ నేతలతో ట్రంప్‌ మాట్లాడారు. ఈమేరకు సోషల్‌ మీడియాలో


అమెరికా అధ్యక్షుడు పోస్టు చేశారు. ‘‘రెండు దేశాల మధ్యే కాల్పుల విరమణ ఒప్పందం చర్చలు జరగాలి. వారికి ఈ చర్చలు గురించి పూర్తిగా తెలుసు’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.  మరోవైపు పుతిన్‌ నిజాయతీని


యురోపియన్‌ నేతలు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌కు సంబంధించి బలవంతమైన శాంతి ఒప్పందం కోసం ట్రంప్‌ ప్రయత్నించవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్‌, రష్యా మధ్య మూడేళ్లుగా ఈ యుద్ధం


జరుగుతున్న సంగతి తెలిసిందే. 2022 ఫ్రిబవరిలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యతో ఇది ప్రారంభమైంది. ఇరువైపుల వేల మంది మరణించారు. ఊహించని రీతిలో ఆస్తినష్టం జరిగింది. ఉక్రెయిన్‌లోని పలు నగరాలు


నామరూపాల్లేకుండా తయారయ్యాయి. 


Trending News

Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండి

Published by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...

Kolleru lake must be protected: andhra cm chandrababu naidu

VIJAYAWADA: Chief Minister Nara Chandrababu Naidu emphasised the urgent need to protect Kolleru Lake, a vital ecological...

Lik: నయన్‌ భర్త కొత్త చిత్రం.. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే..?

నటి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ రూపొందిస్తోన్న చిత్రం ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ (LIK). ఈ సినిమా రిలీజ్‌ డేట్...

Nimmala: బుడమేరు వద్ద సీసీ వాల్‌ నిర్మాణం.. పనుల ఆలస్యంపై మంత్రి నిమ్మల ఆగ్రహం

విజయవాడ: గతేడాది వరదల్లో బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. అక్కడ చేపట్ట...

Urvashi rautela: కేన్స్‌ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలా

కేన్స్‌ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్‌ విడుదల చ...

Latests News

Putin - trump: ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు సిద్ధం: ఫోన్‌లో మాట్లాడుకున్న ట్రంప్‌, పుతిన్‌

మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) దాదాప...

Shubhanshu shukla: జూన్‌ 8న శుభాంశు శుక్లా రోదసి యాత్ర

దిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసియాత్ర ప్రయాణ తేదీ ఖరారైంది. యాక్సియం-4 (ఏఎక్స్‌-4) మిషన్‌...

కోర్టు, ట్రిబ్యునల్‌కు లాక్‌డౌన్‌ పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జార...

Pakistan: భారత్‌కు గగనతలం మూసివేత.. మరో నెల పొడిగించనున్న పాక్‌

భారత్‌ విమానాలకు గగనతలాన్ని మూసివేత నిర్ణయాన్ని మరో నెలపాటు పొడిగించేందుకు పాకిస్థాన్‌ సిద్ధమైనట్లు తెలిసింది. ఇంటర్నెట్...

Shubman gill: టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు గిల్‌కు అప్పగిస్తే.. గుజరాత్‌ కోచ్‌ స్పందనిదే

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే చర్చ నడుస్తోంది. ఇం...

Top