Operation sindoor: ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్‌కు ఉంది: బ్రిటన్‌ ఎంపీ ప్రీతి పటేల్‌

Eenadu

Operation sindoor: ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్‌కు ఉంది: బ్రిటన్‌ ఎంపీ ప్రీతి పటేల్‌"

Play all audios:

Loading...

ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ జరిపిన మెరుపు దాడులను గురించి బ్రిటన్‌ ఎంపీ ప్రీతి పటేల్‌ అక్కడి హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మాట్లాడారు. ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడిలో


అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాద సంస్థలపై దాడి చేసే హక్కు భారత్‌కు పూర్తిగా ఉందని బ్రిటన్‌ ఎంపీ ప్రీతి పటేల్‌ (Priti Patel) పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) పేరుతో పాక్‌


ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె అక్కడి హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మాట్లాడారు. ఈసందర్భంగా పహల్గాం బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు (India-Pakistan) . ‘పహల్గాం


ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను అన్యాయంగా, క్రూరంగా చంపేశారు. ఈ దాడిలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇది ఉగ్రవాద చర్య. భారత్‌లో ఉగ్రవాద చర్యల కారణంగా దెబ్బతిన్న ముంబయి,


న్యూదిల్లీల జాబితాలో ఇప్పుడు పహల్గాం కూడా చేరింది. ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్‌కు ఉంది. అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన పాకిస్థాన్‌ (Pakistan)లోని ఉగ్రవాదుల స్థావరాలనే భారత్‌


లక్ష్యంగా చేసుకుంది. యూకే, భారత్‌ (India-UK)ల మధ్య దీర్ఘకాలిక భద్రతా సహకార ఒప్పందాలు ఉన్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్‌కు బ్రిటన్‌ (UK) ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి’


అని ఆమె పిలుపునిచ్చారు.  పాక్‌ ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తయ్యిబా భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు చరిత్ర స్పష్టం చేస్తోందని పటేల్‌ అన్నారు. ఈ ఉగ్రవాద సంస్థకు హమాస్‌తో


సంబంధాలు ఉన్నాయని ఇటీవల నివేదికలు వెలువడినట్లు వెల్లడించారు. యూకే దాని మిత్రదేశాల ప్రయోజనాలకు ముప్పు కలిగించేలా ఏ ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం పాక్‌లో చురుకుగా ఉన్నాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని


కోరారు.  * ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్.. ఉగ్ర శిబిరాల ఉపగ్రహ చిత్రాలు వైరల్‌ పాక్‌ ప్రతీకారానికి ప్రయత్నించొద్దు  భారత్‌ చేసిన ఆపరేషన్‌ సిందూర్‌పై అమెరికా చట్టసభ సభ్యుడు రో ఖన్నా స్పందించారు.


ఈసందర్భంగా పాకిస్థాన్‌ ప్రతీకారానికి ప్రయత్నించొద్దని పిలుపునిచ్చారు. భారత్‌- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గి శాంతి నెలకొనాలని కోరారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికా సిద్ధంగా


ఉందన్నారు. పాక్‌లో ప్రస్తుతం నిజాయతీ కలిగిన స్వరం లేదని విమర్శించిన ఆయన ఆ దేశ ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌ను నియంతగా అభివర్ణించారు.  


Trending News

Actor Unni Mukundan refutes assault charges, seeks anticipatory bail

KOCHI: Hours after he was booked for the alleged assault of a former associate, Malayalam actor Unni Mukundan on Tuesday...

Real cast away: 32 ఏళ్లుగా.. ఒంటరిగా.. దీవిలో జీవించిన 81 ఏళ్ల పెద్దాయన

Published by: Last Updated:April 28, 2021 12:05 PM IST REAL CAST AWAY: మనిషి సంఘజీవి. ఒంటరిగా బతకడం కష్టం. మరి అతను ఎలా ...

Pawan kalyan - shruti hassan: ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ విష‌యంలో తోపు అంటున్న శ్రుతి!

Published by: Last Updated:February 27, 2021 9:59 PM IST PAWAN KALYAN - SHRUTI HASSAN: మీరేమైనా చెప్పండి! ఎన్న‌యినా చెప్...

Karthika deepam: దీపను లేపేద్దాం.. మాస్టర్ ప్లాన్ వేసిన పారిజాతం.. అయ్యో వంటలక్క చచ్చిపోతుందా?

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Indus water treaty: ఒమర్‌ vs మెహబూబా.. ‘తుల్‌బుల్‌’పై మాటల యుద్ధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్‌ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...

Latests News

Operation sindoor: ఆత్మరక్షణ కోసం పోరాడే హక్కు భారత్‌కు ఉంది: బ్రిటన్‌ ఎంపీ ప్రీతి పటేల్‌

ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత్‌ జరిపిన మెరుపు దాడులను గురించి బ్రిటన్‌ ఎంపీ ప్రీతి పటేల్‌ అక్కడి హౌ...

Pudina karam podi | latest pudina karam podi - eenadu

పొడి,బాత్‌... అన్నీ పుదీనాతోనే! పోషకాలతోపాటూ శరీరానికి చల్లదనాన్నీ అందించే పుదీనాను ఈ వేసవిలో కేవలం పచ్చడికే పరిమితం కాక...

Stock market: భారీ నష్టాల్లో సూచీలు: సెన్సెక్స్‌ 873 పాయింట్లు డౌన్‌.. 24,700 దిగువకు నిఫ్టీ

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి బలహీన సంకేతాల...

అటో మొబైల్‌ అమ్మకాలో రెండంకెల క్షీణత: క్రిసిల్‌ రీసెర్చ్‌

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పొడగింపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటోమొబైల్ పరిశ్రమ రెండంకెల అమ్మకాల క్షీణతకు దారితీస్తుందని క...

Crime news: నకిలీ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి మోసాలు.. 60 మంది అరెస్టు

నకిలీ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి విదేశీయులను మోసగిస్తున్న ముఠాను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. హైదరా...

Top