China: భారత్కు చైనానే ప్రధాన శత్రువు.. బీజింగ్ వద్ద 1,000 అణ్వాయుధాలు..
China: భారత్కు చైనానే ప్రధాన శత్రువు.. బీజింగ్ వద్ద 1,000 అణ్వాయుధాలు.."
Play all audios:
అమెరికా రక్షణ నిఘా సంస్థ నివేదిక అంచనా ఇంటర్నెట్ డెస్క్: చైనా తన సైనిక శక్తిని వేగంగా ఆధునికీకరిస్తోందని, తైవాన్ను ఆక్రమించే ప్రయత్నాల్లో భాగంగా మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని
అమెరికా నివేదిక వెల్లడించింది. ‘వరల్డ్వైడ్ థ్రెట్ అసెస్మెంట్’ పేరుతో అగ్రరాజ్య (USA) రక్షణ నిఘా సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్కు పొరుగు దేశాలతో ఉన్న ముప్పు అంచనాలను
కూడా వెల్లడించింది. 2030 నాటికి చైనా (China) వద్ద కనీసం 1000 అణ్వాయుధాలు ఉంటాయని దీనిలో అంచనా వేసింది. ‘‘చైనాను ప్రధాన శత్రువుగా భారత్ భావిస్తోంది. అందుకు తగినట్లుగానే న్యూదిల్లీ రక్షణ
పరమైన నిర్ణయాలు ఉంటున్నాయి. బీజింగ్ను ఎదుర్కోవడం కోసం తన సైనిక బలం పెంచుకోవడంపై దృష్టి సారిస్తోంది. తూర్పు ఆసియాలో బలమైన శక్తిగా ఉండేందుకు చైనా తన వ్యూహాత్మక లక్ష్యాలను కొనసాగిస్తోంది.
తైవాన్, ఫిలిప్పీన్స్ వంటివాటిపై బహుముఖ ఒత్తిడి పెంచాలని చూస్తోంది. వాణిజ్యం, దౌత్యం, భద్రత పరంగా అమెరికా ప్రపంచ నాయకత్వాన్ని సవాల్ చేస్తోంది’’ అని అగ్రరాజ్య నివేదిక వెల్లడించింది. *
అణ్వాయుధాగారానికి పాక్ పదును! ఇందులో చైనా ఆయుధ సంపత్తి గురించి కూడా అగ్రరాజ్య రక్షణ నిఘా సంస్థ ప్రస్తావించింది. ‘‘2025లో తమ మిలిటరీ బడ్జెట్ను 5.2శాతం పెంచి 247 బిలియన్ డాలర్లు
కేటాయిస్తున్నట్లు చైనా ప్రకటించింది. కానీ, రక్షణ రంగంపై బీజింగ్ చేస్తున్న ఖర్చు ఇంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. గతేడాది ఈ దేశం అనధికారికంగా దాదాపు 304-377 బిలియన్ డాలర్లు ఖర్చు
చేసినట్లు అంచనా. చైనా వద్ద ఆపరేషనల్ న్యూక్లియర్ వార్హెడ్స్కు ఇప్పటికే 600 దాటాయి. 2030 నాటికి ఈ సంఖ్య 1000కి పైగా ఉండొచ్చు. 2035 వరకు బీజింగ్ తన సైనిక శక్తిని పెంచుకుంటూనే ఉంటుందని
అంచనా’’ అని ఆ నివేదిక వెల్లడించింది. పాకిస్థాన్ గురించి కూడా ఈ నివేదికలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆ దేశానికి సైనిక, ఆర్థికపరంగా చైనా నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నా.. భారత్ను మాత్రం
ఓ అస్తిత్వ ముప్పుగానే భావిస్తోందని పేర్కొంది. న్యూదిల్లీ సైనిక శక్తిని దృష్టిలో ఉంచుకొని.. అణ్వాయుధాల అభివృద్ధి సహా సైనిక ఆధునికీకరణ ప్రయత్నాలు కొనసాగిస్తోందని తెలిపింది.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...
జూమ్ వర్సెస్ జియోమీట్తమ యాప్ను కాపీ కొట్టారన్న జూమ్ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్కు దీటుగా రిలయన్స్ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...
Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malayaFor all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Latests News
China: భారత్కు చైనానే ప్రధాన శత్రువు.. బీజింగ్ వద్ద 1,000 అణ్వాయుధాలు..అమెరికా రక్షణ నిఘా సంస్థ నివేదిక అంచనా ఇంటర్నెట్ డెస్క్: చైనా తన సైనిక శక్తిని వేగంగా ఆధునికీకరిస్తోందని, తైవాన్ను ఆక...
Simran: ఆమె నాకు సారీ చెప్పింది.. వివాదంపై స్పందించిన సిమ్రన్..ఇటీవల ఒక నటిని ఉద్దేశించి తాను చేసిన కామెంట్స్పై సిమ్రన్ స్పందించారు. తన సందేశం ఆ నటికి చేరిందని ఆమె క్షమాపణలు చెప్పిం...
Shubman gill: కెప్టెన్గా నీ ప్రవర్తనే ఇప్పుడు చాలా ముఖ్యం: గిల్కు గావస్కర్ సూచనఇంటర్నెట్ డెస్క్: టెస్టు ఫార్మాట్కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు యువ ఆటగాడు ...
Cyber crime: అచ్యుతాపురం to అమెరికా.. నెలకు రూ. 20కోట్ల మేర సైబర్ మోసాలుఅనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కాల్సెంటర్ ద్వారా అమెరికా వాసులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడిన ముఠాను అరెస్...
Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని తల్లి, కుమారుడు మృతిఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటున్న వారిపైకి కారు దూసు...