Ipl 2025: ఆ మూడు నగరాల్లోనే మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు

Eenadu

Ipl 2025: ఆ మూడు నగరాల్లోనే మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌లు ప్రస్తుతానికి ఆగిపోయిన విషయం తెలిసిందే. మిగిలిన 16 మ్యాచులను దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని


బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వేదికగా వాటిని నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  భారత ప్రభుత్వం అనుమతిస్తే...  భారత ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్తతల


నేపథ్యంలో ఐపీఎల్‌ 2025 సీజన్‌లోని మిగతా మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అనుమతి ఇస్తే.. బీసీసీఐ ఉద్రిక్తంగా ఉన్న సరిహద్దులకు దూరంగా దక్షిణాదికి చెందిన


ఆ మూడు నగరాల్లో మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించాలనే ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం.  మరింత కాలం వాయిదా?! ప్రస్తుతం ఐపీఎల్‌ 2025ను బీసీసీఐ ఓ వారంపాటు వాయిదా వేసింది. కానీ నిజానికి వారం తర్వాత


ఐపీఎల్‌ మ్యాచ్‌లను తిరిగి ప్రారంభించడంలో ఎదురయ్యే సవాళ్ల గురించి బీసీసీఐ, ఆయా ఫ్రాంఛైజీలకు అనధికారికంగా తెలియజేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా ఈ ఏడాది చివరి వరకు మ్యాచ్‌లు వాయిదా


పడే అవకాశమే ఎక్కువగా ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. విదేశీ ఆటగాళ్లు తిరిగి రాకపోవచ్చు! విదేశీ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఇప్పటికే వారి స్వస్థలాలకు పయనమయ్యారు. వీరిలో కొంతమంది త్వరలోనే


అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఐపీఎల్‌ 2025 తిరిగి ప్రారంభమైనా వారు రావడం అనుమానాస్పదమే. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు జూన్‌ 11 నుంచి టెస్ట్‌ ఛాంపియన్‌


షిప్‌ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ తిరిగి ప్రారంభమైనా ఈ దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొనడం సందేహమే.


Trending News

Technology | latest tech news today - eenadu

ఐఫోన్‌ డేటా బదిలీ సులువుగా.. కొత్త ఐఫోన్‌ కొన్నారా? పాత ఐఫోన్‌ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారా? థర్డ్...

సేవా సైనికులు.. మీకు సెల్యూట్‌: సీఎం ‌జగన్‌

సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు పొందిన వలంటీర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ వలంటీర్ల సేవా దృక్పథం, మంచి చేయాలన్న తపనన...

రాజమండ్రిలో రుచి చూసిన జైలు జీవితం

ఆనం కళాకేంద్రంలో రావి కొండలరావును సన్మానిస్తున్న జిత్‌ మోహన్‌ మిత్రా(ఫైల్‌) _ఆయనో సినీ విజ్ఞాని. స్క్రీన్‌ప్లే, కథ, కథనా...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

సేంద్రీయ స్వదేశీ నాటు ఆవు పెంపకం క్షేత్రాలు

సాక్షి, అమరావతి: సేంద్రీయ ఏ2 పాల ఉత్పత్తి లక్ష్యంగా స్వదేశీ ఆవుల పెంపకం క్షేత్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించిన రాష్ట్ర ...

Latests News

Ipl 2025: ఆ మూడు నగరాల్లోనే మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌లు ప్రస్తుతానికి ఆగిపోయిన వ...

శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదు

సాక్షి ప్రతినిధి, చెన్నై:  శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టం చేశారు. దీనిపై...

Belait: బెలైట్‌లో ఘనంగా మాతృ దినోత్సవం

బెలైట్‌: బ్రూనైలోని బెలైట్‌లో మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక బెలైట్‌ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన ...

Ram charan: రామ్‌చరణ్‌తో కామన్‌వెల్త్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌: ఫొటోలు వైరల్‌

కామన్‌వెల్త్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ జూలియస్‌, రామ్‌చరణ్‌ మీట్‌ అయ్యారు. సంబంధిత ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తు...

Peru | WSCOM

Peru | WSCOM Menu PERU ------------------------- 04/07/2019 ------------------------- WSCOM PLAY...

Top