డబ్ల్యూటీసీ ఫైనల్.. ఐపీఎల్లో ఆ జట్లకు షాక్
డబ్ల్యూటీసీ ఫైనల్.. ఐపీఎల్లో ఆ జట్లకు షాక్"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: లార్డ్స్ వేదికగా జూన్ 11-15 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final) జరగనుంది. తుది పోరులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా
12 టెస్ట్ల్లో 8 విజయాలతో 69.44 పాయింట్లతో అగ్రస్థానంలో, ఆస్ట్రేలియా 19 మ్యాచ్ల్లో 13 విజయాలతో 67.54 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించాయి. ఈ కీలక మ్యాచ్ కోసం ఇవాళ
ఉదయం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించగా కాసేపటి క్రితం దక్షిణాఫ్రికా కూడా టీమ్ను ప్రకటించింది. తెంబా బావుమా కెప్టెన్గా 15 మందితో టీమ్ను ఎంపిక చేశారు. గాయం కారణంగా కొంతకాలంగా టెస్టులకు
దూరమైన లుంగి ఎంగిడి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్.. ఆ టీమ్లపై ప్రభావం డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రభావం ఐపీఎల్ (IPL)పై పడనుంది. పలు జట్లు కీలక ఆటగాళ్లను సేవలను కోల్పోయే ఛాన్స్ ఉంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా ప్రకటించిన 15 మంది ఆటగాళ్లలో ఎనిమిది మంది ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్నారు. వారెవరంటే.. రికెల్టన్, కోర్బిన్ బాస్ (ముంబయి), లుంగి ఎంగిడి (ఆర్సీబీ),
ట్రిస్టన్ స్టబ్స్ (దిల్లీ), మార్కో యాన్సెన్ (పంజాబ్), మార్క్రమ్ (లఖ్నవూ), కగిసో రబాడ (గుజరాత్), వియాన్ ముల్డర్ (హైదరాబాద్). ఆసీస్ డబ్ల్యూటీసీ జట్టులో ఉన్న కమిన్స్, ట్రావిస్ హెడ్
(హైదరాబాద్), హేజిల్వుడ్ (ఆర్సీబీ), జోష్ ఇంగ్లిస్ (పంజాబ్), మిచెల్ స్టార్క్ (దిల్లీ) ఐపీఎల్లో ఆడుతున్నారు. ఇందులో ముంబయి, ఆర్సీబీ, దిల్లీ, లఖ్నవూ, పంజాబ్ జట్లకు ప్లే ఆఫ్స్
అవకాశాలున్నాయి. మరోవైపు, భారత్, పాక్ ఉద్రికత్తలతో ఇప్పటికే చాలామంది విదేశీ ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోయారు. ఒకవేళ వారు భారత్కు తిరిగి వచ్చినా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాల్సి ఉన్న ఆటగాళ్లు
ఐపీఎల్లో తాము ప్రాతినిధ్యం వహించే జట్లు ప్లే ఆఫ్స్కు చేరితే అందుబాటులో ఉండకపోవచ్చు. * IPL 2025: మళ్లీ మొదటి నుంచి పంజాబ్, దిల్లీ మ్యాచ్ సౌతాఫ్రికా జట్టు: తెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి
జోర్జి, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, మార్కో యాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కోర్బిన్ బాష్, కైల్ వెరినే, డేవిడ్ బెడింగ్హామ్, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్.
సెనురన్ ముత్తుసామి, డేన్ ప్యాటర్సన్. ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్
ఖవాజా, సామ్ కాన్స్టాస్, మ్యాట్ కునెమన్, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్. ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డగెట్.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
Latests News
డబ్ల్యూటీసీ ఫైనల్.. ఐపీఎల్లో ఆ జట్లకు షాక్ఇంటర్నెట్ డెస్క్: లార్డ్స్ వేదికగా జూన్ 11-15 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final) జరగనుంది. తుది పోరులో...
Top ten news @ 5pm: ఈనాడు. నెట్లో టాప్ 10 వార్తలు @ 5pm (nov 17)1. ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు: మంత్రి పొన్నం తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వాహనాలకు రిజిస్ట్రే...
టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...
Team Yaariyan 2 Visits Lalbaugcha Raja In MumbaiTeam Yaariyan 2 Visits Lalbaugcha Raja In Mumbai By: FPJ Web Desk | September 20, 2023...
సేంద్రీయ స్వదేశీ నాటు ఆవు పెంపకం క్షేత్రాలుసాక్షి, అమరావతి: సేంద్రీయ ఏ2 పాల ఉత్పత్తి లక్ష్యంగా స్వదేశీ ఆవుల పెంపకం క్షేత్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించిన రాష్ట్ర ...