Ipl 2025: ధర్మశాల ఎయిర్‌పోర్టు మూసివేత.. ‘ముంబయి ఇండియన్స్‌’పై ఎఫెక్ట్‌

Eenadu

Ipl 2025: ధర్మశాల ఎయిర్‌పోర్టు మూసివేత.. ‘ముంబయి ఇండియన్స్‌’పై ఎఫెక్ట్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాకిస్థాన్‌లోని 9 ప్రాంతాల్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడు(Operation Sindoor)లకు దిగింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర


భారతంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జమ్ము, శ్రీనగర్‌, ధర్మశాల, లేహ్‌, అమృత్‌సర్‌, చండీగఢ్‌తోపాటు పలు విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేసింది. తదుపరి ఆదేశాలు


వచ్చే వరకు విమానాశ్రయాలు తెరవవద్దని ఆదేశాల్లో పేర్కొంది. అయితే ధర్మశాల వేదికగా ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌ ఉండటంతో.. ఆ ప్రభావం ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) పై ఎక్కువగా పడనుంది. ముంబయి,


పంజాబ్‌ల మధ్య ధర్మశాల వేదికగా మే 11న మ్యాచ్‌ ఉండనుంది. దీంతో ముంబయి జట్టు ప్రయాణంపై  ఇది ప్రభావం చూపనుంది. ముంబయి అక్కడికి గురువారం చేరుకోవాల్సి ఉంది. అయితే ధర్మశాల ఎయిర్‌పోర్టు మూసివేత


కారణంగా ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆ జట్టు దృష్టి పెట్టింది. చండీగఢ్‌ ఎయిర్‌పోర్టు కూడా మూసివేయడంతో.. ముంబయి జట్టు మొదట దిల్లీకి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ధర్మశాలకు


వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆ జట్టు ఆలస్యంగా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అయితే.. తమ ప్రయాణ ప్రణాళికల గురించి ముంబయి జట్టు ఇంకా స్పందించలేదు. మరోవైపు ధర్మశాల వేదికగా మే 8న దిల్లీ, పంజాబ్‌ల


మధ్య మ్యాచ్‌ జరగనుంది. దీంతో ఎయిర్‌పోర్టు మూసివేయక ముందే దిల్లీ అక్కడికి చేరుకుంది. అయితే.. మే 11న గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌ కోసం దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు.. రోడ్డు మార్గంలో దిల్లీకి


రావాల్సి ఉంటుంది.  ఇక ధర్మశాల.. పంజాబ్‌ కింగ్స్‌ హోమ్‌గ్రౌండ్‌ అన్న విషయం తెలిసిందే. మరోవైపు భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు.. ఐపీఎల్‌ షెడ్యూల్‌పై ప్రభావం చూపుతాయా అనే దానిపై


ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్‌ ధుమాల్ స్పందించారు. కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను బట్టే తమ నిర్ణయం ఉంటుందని తెలిపారు. ‘‘బీసీసీఐ నిరంతరం పరిస్థితిని గమనిస్తూనే ఉంది. పరిస్థితులు కఠినంగా మారితే అప్పుడు


నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటివరకైతే షెడ్యూల్‌ పరంగానే కొనసాగుతుంది’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.


Trending News

Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత.. ఆ ప్రచారం ఫేక్‌

శ్రీవారి మెట్టు మార్గంలో ఆదివారం ఉదయం చిరుత సంచరించిందనే వార్తలు అవాస్తవమని అటవీ శాఖ ఎఫ్ఆర్‌వో దొరైస్వామి తెలిపారు. తిరు...

Sheikh hasina: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానిపై మరో నేరాభియోగం నమోదు..

Sheikh Hasina ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై అక్కడి ప్రాసిక్యూటర్లు మరో నేరాభియోగాన్ని నమోదు ...

‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగు

సాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రె...

వేలి ముద్రలు పడకపోయినా రేషన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రేషన్‌ సరుకులు తీసుకొనే క్రమంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న వేలి ముద్రల సమస్యను పరి...

Emmanuel macron: మెక్రాన్‌ దంపతుల చిర్రుబుర్రులాట క్లిప్ వైరల్‌.. రష్యా వెటకారం..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫ్రాన్స్‌ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) ముఖాన్ని ఆయన సతీమణి బ్రిగెట్...

Latests News

Ipl 2025: ధర్మశాల ఎయిర్‌పోర్టు మూసివేత.. ‘ముంబయి ఇండియన్స్‌’పై ఎఫెక్ట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాకిస్థాన్‌లోని 9 ప్రాంతాల్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడు(O...

Allu aravind: పవన్‌ మూవీ వేళ అది దుస్సాహసమే.. ఆ నలుగురిలో నేను లేను: అల్లు అరవింద్‌

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ప్రముఖ నిర్మాత అరవింద్‌ (Allu Aravind) స్పందించారు. ఈ ...

India vs pakistan: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్‌ నుంచి భారత్‌ దూరం..

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య (INDIA vs PAKISTAN) ఇటీవల నెలకొన్న ఉద...

డేటా చోరీ: కేంబ్రిడ్జ్ ఎనలిటికాకు సీబీఐ షాక్‌!

సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా చోరీ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డేటా బ్రీచ్‌ కేసుల...

గాంధీ ఆస్పత్రికి అరుదైన గౌరవం

కరోనా ఫైటర్స్ గా మారి చికిత్స అందిస్తున్న ‘గాంధీ’ వైద్యులపై పూల వర్షం కురవబోతుంది.  సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ మహ...

Top