Samantha: అమ్మ కష్టం తెలిసొచ్చింది: ‘శుభం’ ఈవెంట్లో సమంత
Samantha: అమ్మ కష్టం తెలిసొచ్చింది: ‘శుభం’ ఈవెంట్లో సమంత"
Play all audios:
హైదరాబాద్: స్వీయ నిర్మాణంలో సమంత (Samantha) అతిథి పాత్ర పోషించిన చిత్రం ‘శుభం’ (Subham). గవిరెడ్డి శ్రీనివాస్, శాలిని, శ్రియ కొంతం, చరణ్ పేరి తదితర వర్ధమాన నటులతో దర్శకుడు ప్రవీణ్
కండ్రేగుల తెరకెక్కించారు. ఈ హారర్ కామెడీ మూవీ ఈ నెల 9న విడుదలైన సంగతి తెలిసిందే. శుక్రవారం నిర్వహించిన సక్సెస్ ఈవెంట్ (Subham Movie Success Meet) లో సమంత సహా టీమ్ పాల్గొని, సందడి చేసింది.
* సమంత - రాజ్లపై రూమర్స్.. స్పందించిన మేనేజర్ సమంత మాట్లాడుతూ.. ‘‘ప్రొడక్షన్ వైపు ఇంత ధైర్యంగా ఎలా వచ్చేశానా?’ అని ఇటీవల అనుకున్నా. నిర్మాతలు ఎందుకు వరసగా సినిమాలు చేస్తారో
ఇప్పుడర్థమైంది. ప్రేక్షకుల ముఖంపై చిరునవ్వులు చూడడమే అందుకు కారణం. విద్యార్థి దశలోని సమ్మర్ హాలీడేస్ నాకు గుర్తొచ్చాయి. మా కోసం అమ్మ ఎంత కష్టపడిందో ఇప్పుడు తెలిసొచ్చింది. ‘పిల్లలు
నిరుత్సాహపడకూడదు. సినిమాకి తీసుకెళ్లాలి’ అని పరితపించేది. మేం థియేటర్లో సినిమా చూడడం, పాప్కార్న్ కోసం సోదరుడితో గొడవ పడడం, చూసిన సినిమా గురించి చర్చించుకోవడం.. ఇవన్నీ నిన్న జరిగినట్టుగా
ఉంది. నాటి జ్ఞాపకాలను ఫ్యామిలీ ఆడియన్స్ కోసం రీ క్రియేట్ చేయాలనిపించింది. ఆ లక్ష్యంతోనే ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ నెలకొల్పా. ఓ నటిగా జీవితం హ్యాపీ. మరోవైపు సెల్ఫిష్.
సెట్స్కు ఆఖరిగా వచ్చి.. ముందుగా వెళ్లిపోవడం (నవ్వుతూ) ఆనందం. సినిమా రివ్యూల్లో నాకు సంబంధించిన విషయాన్నే ముందుగా చదువుతా. అది స్వార్థం. కానీ, నిర్మాతగా మారాక అభిప్రాయం మారింది’’ ‘‘నేను
ప్రమోషన్స్లో మాత్రమే పాల్గొన్నా. సినిమా పనులన్నీ టీమ్ చూసుకుంది. ప్రేక్షకుల ఆదరణ, ప్రశంసలు వారికే. నా కో- ప్రొడ్యూసర్స్ రాజ్, హిమాంక్ ‘ట్రాలాలా’కు వెన్నెముకలాంటివారు. ప్రవీణ్ టీమ్
ప్లేయర్. ఇగో లేని వ్యక్తి. అతడి విషయంలో గర్వపడుతున్నా. మేమెంత కష్టపడినా.. ప్రేక్షకులకు సినిమా నచ్చితేనే విజయం అందుకుంటుంది. ‘శుభం’ విషయంలో తెలుగు ఆడియన్స్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
నిర్మాతగా తొలి అడుగులు వేస్తున్న నాకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సపోర్ట్ చేసింది. సురేశ్బాబు కుటుంబ సభ్యుడిలాంటివారు. ఈ సినిమా గురించి ఏం అడగకుండానే ‘చేసేద్దాం’ అని భరోసా ఇచ్చారు. నా
ఫ్యాన్స్, నా టీమ్ లేనిదే నేను లేను’’ అని సమంత అన్నారు. ‘శుభం’ రివ్యూ కోసం క్లిక్ చేయండి
Trending News
Nvidia: మైక్రోసాఫ్ట్ను దాటేసిన ఎన్విడియా.. అత్యంత విలువైన కంపెనీల్లో మళ్లీ టాప్Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. మైక్రోసాఫ్ట్ను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. Nv...
Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. రాణించిన ఎల్ఐసీ షేర్లుStock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్...
Tdp mahanadu | latest tdp mahanadu - eenaduవైకుంఠపాళి మనకొద్దు అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదని, మంచి పాలన కొనసాగాలని, ఒకసారి ఎక్కడం, మళ్లీ కింద పడటం, మళ్లీ ఎక్కడం, మ...
Ukraine crisis: ఉక్రెయిన్ నగరాలపై.. 367 డ్రోన్లు, క్షిపణులతో రష్యా దాడివందలాది మంది సైనికులు, పౌరులను విడిచిపెట్టిన రష్యా.. ఉక్రెయిన్పై భీకర దాడులకు తెగబడింది. ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్...
Bhatti vikramarka: పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు: భట్టి విక్రమార్కఅన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం: అ...
Latests News
Samantha: అమ్మ కష్టం తెలిసొచ్చింది: ‘శుభం’ ఈవెంట్లో సమంతహైదరాబాద్: స్వీయ నిర్మాణంలో సమంత (Samantha) అతిథి పాత్ర పోషించిన చిత్రం ‘శుభం’ (Subham). గవిరెడ్డి శ్రీనివాస్, శాలిని,...
Entertainment | tollwood and bollywood news | cinema news - eenaduContents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, w...
Revanth reddy: దేశానికే వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్గాంధీ: సీఎం రేవంత్రెడ్డిహైదరాబాద్: ప్రధానిగా దేశానికే వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్గాంధీ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్...
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్... శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయంReported by: Published by: Last Updated:May 24, 2024 3:27 PM IST అసలే ఓ వైపు సెలవులు.. మరో వైపు అన్ని పరీక్షా ఫలితాలు వి...
Ranveer singh, ali zafar wish 'happy budday' to parineeti chopra in kill dil's new songAnother chirpy number from Yash Raj's latest offering _Kill Dil _released recently. Matching the other tracks from ...