Operation sindoor: మాకు న్యాయం జరిగింది : పహల్గాం బాధిత కుటుంబసభ్యులు

Eenadu

Operation sindoor: మాకు న్యాయం జరిగింది : పహల్గాం బాధిత కుటుంబసభ్యులు"

Play all audios:

Loading...

ఇంటర్నెట్ డెస్క్‌: మంగళవారం అర్ధరాత్రి దాటాక పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ దాడులు ప్రారంభించింది. గతనెల 22న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. అందుకు


ప్రతీకారంగా భారత ఆర్మీ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట మెరుపుదాడులకు దిగింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రముఖలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇదే సమయంలో పహల్గాం బాధిత కుటుంబ సభ్యులు కూడా


స్పందించారు. ఈసందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ దాడులతో తమకు న్యాయం జరిగిందన్నారు. భారత ఆర్మీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. జమ్మూకశ్మీర్‌లోని స్థానికులూ


భారత ఆర్మీకి జిందాబాద్‌లు కొడుతూ ‘భారత మాతాకీ జై’’ అంటూ నినదించారు. * భారత్‌ మెరుపుదాడిలో.. 80 మంది ఉగ్రవాదులు మృతి..? ‘‘ మేం ఇంతటి బాధలోనూ ఆనందపడుతున్నాం. ప్రధాని మోదీ తప్పకుండా ప్రతీకారం


తీర్చుకుంటారు. ఈ ఆపరేషన్‌కు పెట్టిన పేరే అందుకు నిదర్శనం. మా కన్నీళ్లు ఆగలేదు. ఉగ్రవాదుల వల్ల సోదరీమణులు తమ సిందూరం కోల్పోయినందున వారికి గుర్తుగా ఈ దాడులకు నామకరణం చేశారు. తొమ్మిది


స్థానాల్లో వారిపై భారత ఆర్మీ ఎదురుదాడికి దిగింది. ఇది నిజంగా భిన్నమైన అనుభూతి. ఆనందంతో కూడిన కన్నీళ్లు ఆగవు’’ - సంతోష్ జగ్‌దలే కుమార్తె అశ్విరి ‘‘మన కుమార్తెల సిందూరం తుడిచిపెట్టిన


ఉగ్రవాదులకు ఇదే సరైన సమాధానం. ఈ ఆపరేషన్‌ పేరు వినగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈసందర్భంగా ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా’’ - సంతోష్‌ జగ్‌దలే భార్య ప్రగతి జగ్‌దలే ‘‘


నేను ఉదయం నుంచి నిరంతరం వార్తలు చూస్తూనే ఉన్నా. ఈసందర్భంగా  భారత ఆర్మీకి సెల్యూట్‌ చేస్తున్నా. ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. దేశ ప్రజల బాధను విని పాక్‌ ఉగ్రస్థావరాలపై ఎటాక్‌ చేసినందుకు


కృతజ్ఞతలు. ఉగ్రవాదులపై దాడి చేస్తున్నట్లు వార్తలను విన్నప్పటినుంచి మా కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా ఉంది’’ - శుభమ్‌ ద్వివేది తండ్రి సంజయ్‌ ద్వివేది ‘‘ పహల్గాం ఉగ్ర దాడుల్లో మృతి చెందిన నా


మేనల్లుడు సోమిశెట్టి మధుసూదన్ రావు ఆత్మకు నేడు శాంతి కలుగుతుంది. గత రెండు వారాలుగా నా మేనల్లుడి మృతి ఘటన తీవ్రంగా కలచివేసింది. తాజాగా పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్‌ చేసిన మెరుపు


దాడులతో సాంత్వన కలిగింది’’ - మధుసూదన్ రావు మేనమామ వెంకటసుబ్బయ్య ‘‘భారత ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలని గత కొద్ది రోజులుగా నన్ను మీడియా అడిగినప్పుడల్లా ఒకటే చెప్పా. నేను ప్రభుత్వాన్ని


నమ్ముతున్నానని చెప్పా. ఇప్పుడు వారి బాధ్యతలను నిర్వర్తించారు. ఇవాళ అమలు చేశారు. పహల్గాం దాడిలో ఇష్టమైన వారిని కోల్పోయిన కుటుంబాలు తమవారిని ఎలానూ తిరిగి పొందలేవు. కానీ, ఇప్పుడీ చర్యతో


సమాజానికి ఓ పెద్ద సందేశం పంపినట్లు అయింది. మేం కూడా ఇలాంటి ప్రతిచర్యనే కోరుకున్నాం. పాకిస్థాన్‌ ఉగ్రవాదులు ఎప్పటికీ దీనిని మరిచిపోరని భావిస్తున్నా’’ - లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ తండ్రి


రాజేశ్‌ నర్వాల్


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్‌ క్రికెట్‌లో కొనసాగాల్సింది: సయ్యద్‌ కిర్మాణి

విరాట్‌కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్‌ క్రికెట్‌ దాగిఉందని టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ సయ్య...

Latests News

Operation sindoor: మాకు న్యాయం జరిగింది : పహల్గాం బాధిత కుటుంబసభ్యులు

ఇంటర్నెట్ డెస్క్‌: మంగళవారం అర్ధరాత్రి దాటాక పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ దాడులు ప్రారంభించింది. గతనెల 22న ...

Air india | latest air india - eenadu

పాక్‌ గగనతలం మూసివేత.. ఎయిరిండియా, ఇండిగో కీలక ప్రకటన Air India: పాక్‌ తన గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో ఎయిరిండియా, ఇండ...

Chandrababu: కెంపెగౌడ విమానాశ్రయాన్ని సందర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

బెంగళూరు: బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో కొత్తగా అభివృద్ధి చేసిన టెర్మినల్‌-2ను ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ ...

Ms dhoni: అరుదైన రికార్డ్‌కు ఒక అడుగు దూరంలో ఎంఎస్‌ ధోని

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంఎస్‌ ధోని (MS Dhoni) మరో మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 403 టీ20 మ్యాచ్‌లు ఆడిన ధోని...

Revanth reddy: ఆ నలుగురికి నేను నచ్చను.. సంచలనంగా మారిన రేవంత్ రెడ్డి కామెంట్స్

Published by: Last Updated:November 27, 2022 4:07 PM IST ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ (TELANGANA CONGRESS) క్లిష్ట పరిస్థ...

Top