Bjp: ఆపరేషన్‌ సిందూర్‌ 100% సక్సెస్‌.. మోదీ వ్యూహాలు శత్రుదేశం ఊహకు కూడా అందవు: భాజపా

Eenadu

Bjp: ఆపరేషన్‌ సిందూర్‌ 100% సక్సెస్‌.. మోదీ వ్యూహాలు శత్రుదేశం ఊహకు కూడా అందవు: భాజపా"

Play all audios:

Loading...

దిల్లీ: పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) పేరిట పాకిస్థాన్‌కు భారత్‌ గట్టి జవాబిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో


సరిహద్దుల్లో వాతావరణం కాస్త ప్రశాంతంగా మారింది. ఈనేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నాయకత్వ పటిమను భాజపా (BJP) కొనియాడింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంబిత్‌ పాత్ర (Sambit


Patra) దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) వంద శాతం విజయవంతమైందని సంబిత్‌ పాత్రా పేర్కొన్నారు. ‘‘మన సైన్యం వంద శాతం విజయం సాధించింది. అది కూడా నియంత్రిత,


కచ్చితమైన చర్యల ద్వారా. పాకిస్థాన్‌లోని కీలక ప్రాంతాలను సైన్యం టార్గెట్‌గా చేసుకుంది’’ అని ఆయన వివరించారు. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలకు


హామీ ఇచ్చారని సంబిత్‌ పాత్ర పేర్కొన్నారు. నరేంద్ర మోదీ వ్యూహాలు శత్రుదేశం ఊహలకు కూడా అందవని కొనియాడారు. ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట భారత సైన్యం తమ సత్తా చాటిందని పేర్కొన్నారు. ఇది అద్భుత


విజయమని.. పాకిస్థాన్‌ భూభాగంలోని సుదూర ప్రాంతాలకు దూసుకెళ్లి.. శత్రు దేశ ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించారని.. ఇది నయా భారత్‌ అని పేర్కొన్నారు. ఒక అణ్వాయుధ దేశం లోతుల్లోకి వెళ్లి దాడి చేయడం ఇదే


మొదటిసారని వెల్లడించారు. * అవును.. మా యుద్ధవిమానం ధ్వంసమైంది: అంగీకరించిన పాకిస్థాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో ప్రధాని మోదీ ఐదు లక్ష్యాలను నిర్దేశించుకున్నారని సంబిత్‌ పాత్ర


పేర్కొన్నారు. మొదటిది శత్రు భూభాగంలోని సుదూర ప్రాంతాలకు వెళ్లి దాడి చేయడం.. రెండోది ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడం.. మూడోది వాటిని పూర్తిగా నిర్మూలించడం.. నాల్గోది ఈ ప్రక్రియలో పౌరులెవరూ


గాయపడకుండా చూసుకోవడం.. ఐదోది సైనిక మౌలిక సదుపాయాలపై దాడి చేయకుండా ఉండటమని వివరించారు. ఈసందర్భంగా భారత సైన్యం అజేయమైన శక్తిపాటవాలను ప్రదర్శించిందని.. ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసిందని


కొనియాడారు.


Trending News

Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత.. ఆ ప్రచారం ఫేక్‌

శ్రీవారి మెట్టు మార్గంలో ఆదివారం ఉదయం చిరుత సంచరించిందనే వార్తలు అవాస్తవమని అటవీ శాఖ ఎఫ్ఆర్‌వో దొరైస్వామి తెలిపారు. తిరు...

Sheikh hasina: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానిపై మరో నేరాభియోగం నమోదు..

Sheikh Hasina ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై అక్కడి ప్రాసిక్యూటర్లు మరో నేరాభియోగాన్ని నమోదు ...

‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగు

సాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకం ద్వారా మా కుటుంబాల్లో వెలుగులు నింపారని పొదుపు సంఘాల మహిళలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రె...

Us elections 2024: అమెరికా కొత్త వైస్ ప్రెసిడెంట్.. ఆంధ్రా అల్లుడే.. ఎలాగంటే

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Nda meet: ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని భేటీ

దిల్లీ: ఎన్డీయే (NDA) పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) దిల్లీలో సమావేశమయ...

Latests News

Bjp: ఆపరేషన్‌ సిందూర్‌ 100% సక్సెస్‌.. మోదీ వ్యూహాలు శత్రుదేశం ఊహకు కూడా అందవు: భాజపా

దిల్లీ: పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) పేరిట పాకిస్థాన్‌కు భారత్‌ గట్టి జవాబిచ్చిన విషయం ...

Navi mumbai’s very own no-nonsense nayak: tukaram mundhe, ias

When Shivaji Rao (Anil Kapoor) takes over as Chief Minister of Maharashtra for just one day in Shankar-directed politica...

రేవంత్ రెడ్డి గురించి మంత్రి సీతక్క గొప్ప మాటలు

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Andhra pradesh news | ap news in telugu | andhra news - eenadu

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, w...

వరలక్ష్మీ వ్రతం.. కొండెక్కిన పూలు!

వన్‌టౌన్‌(విజయవాడ పశ్చిమ): వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని నగరంలో పూల ధరలు గురువారం చుక్కలనంటాయి. కరోనా వైరస్‌ ఉధృతి...

Top