Operation sindoor: ఆపరేషన్ సిందూర్.. రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ
Operation sindoor: ఆపరేషన్ సిందూర్.. రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ"
Play all audios:
దిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ
ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) భేటీ అయ్యారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేపట్టిన దాడుల గురించి రాష్ట్రపతికి ప్రధాని వివరించారు. రేపు
అఖిలపక్ష భేటీ.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు జరగబోయే ఈ భేటీలో.. ‘ఆపరేషన్ సిందూర్’ తదనంతర పరిణామాలను ఆయా పార్టీల నేతలకు ప్రభుత్వం
వివరించనుంది. జాతీయ భద్రత విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, హోంశాఖ మంత్రి అమిత్షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్
రిజిజు తదితరులు ఈ భేటీకి హాజరుకానున్నారు. మరోవైపు భారత మెరుపుదాడులను విపక్ష నేతలు స్వాగతించారు. పాకిస్థాన్ ఉగ్ర చర్యలకు వ్యతిరేకంగా భారత్ తీసుకునే ఎలాంటి నిర్ణయాలకైనా తమ మద్దతు ఉంటుందని
ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఈ మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ నిర్వహించనుంది. ప్రస్తుత పరిణామాలపై కాంగ్రెస్ నేతలు ఈ భేటీలో చర్చించనున్నారు. అమిత్షా
అత్యున్నతస్థాయి సమీక్ష ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, డీజీపీలు, ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష చేపట్టనున్నారు. ఈ
భేటీకి జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, సిక్కిం, పశ్చిమబెంగాల్ సీఎంలు, గవర్నర్లు, అధికారులు హాజరుకానున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో
పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. పాక్లోని 4, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 5 స్థావరాలపై దాడులు చేసింది. ఇప్పటివరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు
వార్తలొస్తున్నాయి. బవహల్పూర్(జైషే మహమ్మద్), మురిద్కే (లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది.
Trending News
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Vivek plays a retired police officer in 'vellai pookkal'The technical crew of _Vellai Pookkal_ includes Ramgopal Krishnaraju for music composition, with Jerald Peter cranking t...
Andhra pradesh: వీర జవాన్ల కుటుంబాలకు అండగా సీఎం జగన్... భారీ ఆర్ధికసాయంPublished by: Last Updated:April 05, 2021 3:06 PM IST ఛత్తీస్గఢ్ ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన...
Movie review: సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. జెన్యూన్ రివ్యూ చెప్పేసిన అభిమానులు..Reported by: Published by: Last Updated:January 14, 2025 3:47 PM IST కాకినాడ జిల్లాలో 'సంక్రాంతికి వస్తున్నాం'...
Murti latest news in hindi, photos, videos on murti inextlive jagranदेश को दिल देने वाली कविता कृष्णमूर्ति का आज है जन्मदिन bollywood-masala7 years ago बॉलीवुड में अपने जबरदस्त गानों से लो...
Latests News
Operation sindoor: ఆపరేషన్ సిందూర్.. రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీదిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్...
Huzurabad bypoll: హీటెక్కిన హుజురాబాద్.. నేడు ఈటల రాజేందర్, బల్మూరి వెంకట్ నామినేషన్Published by: Last Updated:October 08, 2021 8:14 AM IST HUZURABAD BYELECTIONS 2021: టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీ...
Chiranjeevi, tamannaah bhatia starrer bhola shankar to stream on ott from this dateChiranjeevi's latest outing to the cinemas, _Bhola Shankar_, will soon be available for streaming on OTT. Besides t...
Earth at perihelion 2023 : ఇవాళ సూర్యుడికి దగ్గరగా భూమి.. ఏం జరుగుతుంది?CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలి :శ్రీదేవితాడికొండ: కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేయాలని తాడికొండ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక...