Vedanta: ఈశాన్య రాష్ట్రాల్లో వేదాంత గ్రూప్ భారీ పెట్టుబడి
Vedanta: ఈశాన్య రాష్ట్రాల్లో వేదాంత గ్రూప్ భారీ పెట్టుబడి"
Play all audios:
వేదాంత గ్రూప్ ఈశాన్య ప్రాంతంలో చమురు & గ్యాస్, కీలకమైన ఖనిజాలు, ఇతర రంగాలలో రూ. 30,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ‘వేదాంత గ్రూప్’ ఈశాన్య రాష్ట్రాల్లో గ్యాస్, ఖనిజాలు, చమురు శుద్ధి
సౌకర్యాలు, విద్యుత్, ఆప్టికల్ ఫైబర్, సిస్టం ఇంటిగ్రేషన్, పునరుత్పాదక ఇంధనం, ప్రసార రంగాలు, డేటా సెంటర్లలో రూ. 30,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ రోజు(శుక్రవారం) ప్రకటించింది. ఈ
పెట్టుబడితో వేదాంత గ్రూప్..అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ, మిజోరాం అంతటా విస్తరించి; చమురు, గ్యాస్, కీలకమైన ఖనిజాలు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలపై దృష్టి సారిస్తుంది. ఈ
పెట్టుబడుల వల్ల ఆయా ప్రాంతాల్లో 1 లక్ష ఉద్యోగాల కల్పనతో పాటు ఆర్థిక వృద్ధి జరుగుతుందని, సామాజిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని సంస్థ తెలిపింది. ఈశాన్య ప్రాంతంలో హైడ్రోకార్బన్లకు
సంబంధించి..వేదాంత అతిపెద్ద అన్వేషణ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. చమురు, గ్యాస్ నుంచి కీలకమైన ఖనిజాల వరకు అత్యంత అద్భుతమైన సహజ వనరులు, ప్రతిభావంతులైన మానవ వనరుల అసాధారణమైన సమూహాన్ని
కలిగి ఉన్న ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి సంస్థ పూర్తిగా కట్టుబడి ఉందని వేదాంత గ్రూప్ చైర్మన్ ‘అనిల్ అగర్వాల్’ అన్నారు. వేదాంత, దాని అనుబంధ సంస్థలు అస్సాం నుంచి మేఘాలయకు 1,000 మెగావాట్ల
విద్యుత్తును సరఫరా చేయడానికి అనుమతించే 300 సర్క్యూట్ కే.ఎం. ట్రాన్స్మిషన్ సిస్టం నెట్వర్క్లో కూడా పెట్టుబడులు పెట్టాయి. ఈ ప్రాజెక్ట్ మేఘాలయ, అస్సాంలో విద్యుత్ సౌకర్యాలను గణనీయంగా
మెరుగుపరుస్తుంది.
Trending News
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్పామ్ శుద్ధి ప్...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seatNARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...
Army: ఆర్మీ యూనిఫామ్ అక్రమ తరలింపు.. మిలిటరీ ఇంటెలిజెన్స్ సాయంతో దాడులు..ఇంటర్నెట్డెస్క్: సైన్యానికి యుద్ధ రంగంలో ఉపయోగపడేలా ప్రత్యేకంగా డిజిటల్ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన యూనిఫామ్లను ప...
Ind vs pak మ్యాచ్ రద్దయితే సూపర్ 4కు పాకిస్తాన్.. మరి టీమిండియా పరిస్థితి ఏంటి?CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Latests News
Vedanta: ఈశాన్య రాష్ట్రాల్లో వేదాంత గ్రూప్ భారీ పెట్టుబడివేదాంత గ్రూప్ ఈశాన్య ప్రాంతంలో చమురు & గ్యాస్, కీలకమైన ఖనిజాలు, ఇతర రంగాలలో రూ. 30,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టను...
Andhra pradesh news | ap news in telugu | andhra news - eenaduContents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, w...
Assam: sivasagar university professor mozharur rahman passes awayASSAM: Professor Mozharur Rahman alias Jerry, 59, a prominent educationist and head of the Department of Computer Scienc...
India oil bill: దిగొచ్చిన చమురు ధరలు.. రూ. 1. 8 లక్షల కోట్లు ఆదాIndia Oil bill: అంతర్జాతీయంగా తగ్గిన చమురు ధరల కారణంగా భారత్కు రూ.1.8 లక్షల కోట్ల మేర ఆదా అవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక...
Flight operations: చల్లారిన ఉద్రిక్తతలు.. 32 విమానాశ్రయాలు రీఓపెన్దిల్లీ: భారత్-పాక్ (India-Pakistan) నడుమ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారత్లోని 32 విమానాశ్రయాలను మే 15 వరకు మూ...