Ap polycet results: ఏపీ పాలిసెట్‌లో 19మందికి 120/120 మార్కులు.. ‘గోదావరి’ విద్యార్థులదే హవా

Eenadu

Ap polycet results: ఏపీ పాలిసెట్‌లో 19మందికి 120/120 మార్కులు.. ‘గోదావరి’ విద్యార్థులదే హవా"

Play all audios:

Loading...

ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. By Features Desk Updated : 14 May 2025 19:57 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 2 min read ఫలితాల కోసం క్లిక్‌ చేయండి AP Polycet


Results| ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలిసెట్‌-2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా


లోకేశ్(Nara Lokesh) విడుదల చేశారు. ఏపీ పాలిసెట్‌లో 19 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించి అదరగొట్టారు. ఈ విద్యార్థుల అపూర్వ విజయాన్ని మంత్రి లోకేశ్‌ అభినందించారు. వారి అద్భుతమైన


కృషి, అంకితభావాన్ని ప్రశంసిస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ఈ ఏడాది పాలిసెట్‌లో మొత్తంగా 95.36శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 98.66శాతం ఉత్తీర్ణత


నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. ఈసారి మొత్తంగా 1,39,840 మంది పాలిసెట్‌ రాయగా.. వీరిలో 1,33,358 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ అభినందనలు


తెలిపారు. (AP Polycet 2025 Results) * ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల పాలిసెట్‌లో గోదావరి విద్యార్థుల హవా..  ఏపీ పాలిసెట్‌ ఫలితాల్లో 120కి 120 మార్కులు సాధించిన 19మంది


విద్యార్థుల్లో ఐదుగురు అమ్మాయిలు కాగా.. మిగతా వారంతా అబ్బాయిలే. వీరిలో 15మంది ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారే ఉండటం విశేషం. అలాగే, విశాఖ నుంచి ఇద్దరు, కాకినాడ, ప్రకాశం జిల్లాలకు చెందిన


ఒక్కొక్కరు ఉన్నారు.  ర్యాంక్‌ కార్డు డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి టాపర్లు వీరే.. బి. శశివెంకట్‌ (తూ.గో జిల్లా), బాలినేని కల్యాణ్‌ రామ్‌ (విశాఖ), మెర్ల జేఎస్‌ఎన్‌వీ చంద్రహర్ష (తూ.గో),


బొడ్డేటి శ్రీకర్‌ (ప.గో జిల్లా), వరుణ్‌తేజ్‌ (తూ.గో), వి. ప్రవళిక (ప.గో), ఆకుల నిరంజన్‌ శ్రీరామ్‌ (తూ.గో), చింతాడ చోహాన్‌ (విశాఖ), కోదాటి కృష్ణ ప్రణయ్‌ (ప.గో), బి.రక్షిత శ్రీ స్వప్న (తూ.గో),


ఆర్‌. చాహ్న (తూ.గో), పాల రోహిత్‌ (ప.గో), యు.చక్రవర్తుల శ్రీ దీపిక (ప.గో), చలువాది ఖాధిరేశ్‌ (ప్రకాశం), కొప్పిశెట్టి అభిజిత్‌ (కాకినాడ), పి. నితీశ్‌ (ప.గో),  వై.హేమచంద్రకుమార్‌ (తూ.గో), ఎ.


యశ్వంత్ పవన్‌ సాయిరామ్‌ (ప.గో), ఎం. ఉమా దుర్గ శ్రీనిధి (తూ.గో) (AP Polycet toppers list) రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 30న AP Polycet 2025 పరీక్షను స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌


అండ్‌ ట్రైనింగ్‌ (SBTET) అధికారులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఫైనల్‌ కీ విడుదల చేసిన అధికారులు.. తాజాగా ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌


పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని డిప్లొమా (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ) సీట్లను పాలిసెట్‌ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Latests News

Ap polycet results: ఏపీ పాలిసెట్‌లో 19మందికి 120/120 మార్కులు.. ‘గోదావరి’ విద్యార్థులదే హవా

ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. By Features Desk Updated : 14 May 2025 19:57 IST Ee Font size * ABC MEDIUM * ABC LAR...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Bhargavastra: మన భార్గవాస్త్రం సిద్ధం.. శత్రు డ్రోన్ల దండుకు గండం..

Bhargavastra: డ్రోన్ల సమూహాన్ని పక్కాగా ఛేదించే స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించారు...

Revanth reddy: నిజమైన లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదు: సీఎం రేవంత్‌రెడ్డి

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డుల పంపిణీ పథకాలను ఆదివారం ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్...

Robert DuBois - WPR

Robert DuBoisLatest Posts...

Top