Bhargavastra: మన భార్గవాస్త్రం సిద్ధం.. శత్రు డ్రోన్ల దండుకు గండం..

Eenadu

Bhargavastra: మన భార్గవాస్త్రం సిద్ధం.. శత్రు డ్రోన్ల దండుకు గండం.."

Play all audios:

Loading...

Bhargavastra: డ్రోన్ల సమూహాన్ని పక్కాగా ఛేదించే స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో


తేలికగా అందుబాటులో ఉంటున్న డ్రోన్లు.. దేశ భద్రతకు సవాళ్లుగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న భారత్‌తో ఉద్రిక్తతల సమయంలో పాక్‌ మన దేశంపైకి భారీ ఎత్తున డ్రోన్లతో దాడులు చేయగా.. మన దళాలు సమర్థంగా


వాటిని అడ్డుకున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి ముప్పులు ఎదురైతే డ్రోన్ల (Drones) సమూహాన్ని నిర్వీర్యం చేసేలా ఓ సరికొత్త వ్యవస్థ సిద్ధమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే కౌంటర్‌ డ్రోన్‌


వ్యవస్థ (Counter Drone System)ను ‘భార్గవాస్త్ర (Bhargavastra)’ను అభివృద్ధి చేసింది సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ సంస్థ. తాజాగా ఈ అస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని


గోపాల్‌పుర్‌లో గల సీవార్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ‘భార్గవాస్త్ర’ మైక్రో రాకెట్ వ్యవస్థను పరీక్షించగా.. అన్ని లక్ష్యాలను విజయవంతగా ఛేదించినట్లు ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ అధికారులు వెల్లడించారు.


దీనికి మొత్తం మూడు ట్రయల్స్‌ నిర్వహించారు. రెండు ట్రయల్స్‌లో ఒక్కో రాకెట్‌ చొప్పున పెట్టి పరీక్షించారు. మూడో దశలో రెండు రాకెట్లను ఒకేసారి 2 సెకన్ల వ్యవధిలో పేల్చి లక్ష్యాన్ని ఛేదించారు. *


డ్రోన్లే కాదు.. మిలిటరీ సిబ్బందినీ పంపించి: భారత్‌పై విషం కక్కిన తుర్కియే! ఈ ‘భార్గవాస్త్ర’ను పూర్తి స్వదేశీ సామర్థ్యంతో అభివృద్ధి చేశారు. 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు డ్రోన్లను


గుర్తించి ఇది మైక్రో రాకెట్ల సాయంతో నిర్వీర్యం చేయగలదు. ఇందులోని రాడార్‌ వ్యవస్థ.. గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పులను కూడా పసిగట్టగలదు. తొలి లేయర్‌లో అన్‌గైడెడ్‌ మైక్రో


రాకెట్లను పెట్టి.. 20 మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల దండును నాశనం చేసేలా దీన్ని రూపొందించారు. ఇక, రెండో లేయర్‌లో గైడెడ్‌ మైక్రో మిసైల్‌ను ఉంచుతారు. ఇవి లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి


నిర్వీర్యం చేస్తాయి. సముద్రానికి 5000 మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో, కొండల ప్రాంతాల్లోనూ వీటిని సమర్థంగా ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.


Trending News

20 వరకు కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

నాలుగేళ్ల ప్రేమ విషాదాంతం

శిరీష, వెంకటేష్‌ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...

Latests News

Bhargavastra: మన భార్గవాస్త్రం సిద్ధం.. శత్రు డ్రోన్ల దండుకు గండం..

Bhargavastra: డ్రోన్ల సమూహాన్ని పక్కాగా ఛేదించే స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించారు...

Revanth reddy: నిజమైన లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదు: సీఎం రేవంత్‌రెడ్డి

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డుల పంపిణీ పథకాలను ఆదివారం ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్...

Robert DuBois - WPR

Robert DuBoisLatest Posts...

Pollution: పాక్‌ పంజాబ్‌పై కాలుష్యం పంజా.. నెలలో 18లక్షల మంది ఆసుపత్రులకు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌లోని (Pakistan) పంజాబ్‌ ప్రావిన్సులో కాలుష్యం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో లక్షల మంది...

Rajnath singh: మా సహనాన్ని పరీక్షించొద్దు - పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌ వార్నింగ్‌

భారత్‌ సహనాన్ని అవకాశంగా తీసుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే నిన్నటి మాదిరి (ఆపరేషన్‌ సిందూర్‌) పరిణామాలకు సిద్ధంగా ఉండాలని ...

Top