Donald trump: ఇరాన్పై దాడులు చేయడం సరికాదు: నెతన్యాహుతో ట్రంప్
Donald trump: ఇరాన్పై దాడులు చేయడం సరికాదు: నెతన్యాహుతో ట్రంప్"
Play all audios:
Iran-USA: ఇరాన్పై ఎటువంటి సైనిక చర్యలకు పాల్పడొద్దని తాను గత వారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు చెప్పానని తాజాగా ట్రంప్ వెల్లడించారు. ఇంటర్నెట్డెస్క్: ఇరాన్పై దాడులు చేయొద్దని ఇజ్రాయెల్
ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు చెప్పానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెల్లడించారు. దీనిపై గతవారం నెతన్యాహుతో ఫోన్కాల్లో మాట్లాడనని చెప్పారు. ఇరాన్తో జరుగుతోన్న అణు
చర్చలకు అంతరాయం కలిగించేలా సైనిక చర్య ఉండకూడదని సూచించానని మీడియాతో వెల్లడించారు. ‘‘అవును నేను చెప్పాను. మనం ఒక పరిష్కారానికి దగ్గరగా వస్తున్నాం. ఇప్పుడు ఇలా చేయడం ఏమాత్రం సరికాదని చెప్పాను.
ఒక్క ఫోన్కాల్తో మార్పు రావొచ్చు. ఇప్పుడు ఇరాన్ ఒక ఒప్పందం చేసుకోవాలని అనుకుంటుందని నేను అనుకుంటున్నా. మనం ఒక ఒప్పందం కుదుర్చుకోగలిగితే, చాలామంది ప్రాణాలు కాపాడొచ్చు’’ అని వెల్లడించారు.
ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ (Israel) చేస్తోన్న ప్రణాళికలను యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు పసిగట్టారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందన
వచ్చింది. * ఇజ్రాయెల్ చేతిలో కాంతి ఖడ్గం..! కాగా.. ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్ (Iran)తో సంబంధాలు అంతంతమాత్రంగానే సాగాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో అణుఒప్పందం
నుంచి అమెరికా వైదొలిగింది. టెహ్రాన్పై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి ఎన్నోఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఈక్రమంలోనే మరోసారి అణుఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ ఇటీవల సంసిద్ధత
వ్యక్తంచేశారు. అణుఒప్పందంపై ఇరాన్తో చర్చలు జరిపేందుకే ప్రాధాన్యం ఇస్తానని, ఎందుకంటే తాను ఆ దేశాన్ని దెబ్బతీయాలనుకోవడం లేదని పేర్కొన్నారు. ఆ దిశగా ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై
ఇటీవల ఒమన్లో ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చలు నిర్మాణాత్మకంగా జరిగి ఫలవంతం అయ్యాయని చర్చల్లో పాల్గొన్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ పేర్కొన్నారు. న్యూక్లియర్ డీల్ కుదరకపోతే
సైనిక చర్యలకు దిగుతామంటూ ట్రంప్ హెచ్చరికలు కూడా చేశారు. మరోవైపు ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ కూడా చర్చలు సాఫీగా జరుగుతున్నట్లు ధ్రువీకరించడం విశేషం. ఇరాన్ విషయంలో ప్రత్యర్థుల వైఖరిలో మార్పు
రానంతవరకు ప్రత్యక్ష చర్చలకు అవకాశం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘీ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Trending News
దేవుని కారుణ్యాన్ని పొందిన మోషే!!దైవజనుడైన మోషే కారణజన్ముడు. కాని లోకపరంగా ఆలోచిస్తే ఒంటరితనానికి నిర్వచనంగా బతికాడు. తల్లి ఒడిలో వెచ్చగా గడపాల్సిన పసితన...
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Who: ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవడం నేరం.. డబ్ల్యూహెచ్వో చీఫ్ఇంటర్నెట్డెస్క్: గాజాపై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో (Israel-Hamas Conflict) దాడులతో విరుచుకుపడుతోంది. సామాన్య పౌరులు పె...
Dhanush-starrer naane varuven’s new poster unveiled_Naane Varuven's _new poster_ _was unveiled today. The film stars Dhanush in a leading role. The poster features Dh...
Costly color: ఈ రంగు గోల్డ్ కంటే ఖరీదైనది.. దాని పేరు, ప్రత్యేకత తెలిస్తే షాక్ అవుతారురంగుల పండుగ హోలీలో అందరూ రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలంతో సహా ఇతర రంగులు మార్కెట్లో ...
Latests News
Donald trump: ఇరాన్పై దాడులు చేయడం సరికాదు: నెతన్యాహుతో ట్రంప్Iran-USA: ఇరాన్పై ఎటువంటి సైనిక చర్యలకు పాల్పడొద్దని తాను గత వారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు చెప్పానని తాజాగా ట్రంప్...
ఆర్ఆర్ఐలో అక్రమాలు: వారికి ధనార్జనే ధ్యేయంగుడివాడ టౌన్: హోమియో ప్రాంతీయ పరిశోధనా సంస్థ (ఆర్ఆర్ఐ) అక్రమాలకు వేదికగా మారింది. ఈ అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చి...
పంట నష్టం అంచనాలో వ్యవసాయ శాఖపశ్చిమ గోదావరి జిల్లా ముక్కామలలో నీట మునిగిన పంటలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, వరదలతో పంట...
ఐపీఎల్ స్పాన్సర్ ఎవరు?ఐపీఎల్–2020కి ‘వివో’ ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించడం లేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ముంబై: ఇండియన్ ప్రీమియర్...
అగ్రి గోల్డ్ బాధితులకు తీపి కబురుసాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ అమలులో మరో అడుగు ముందుకు పడుతోంది. సీ...