Operation sindoor: అవును.. భారత్‌ క్షిపణుల దెబ్బ మాకు తగిలింది: పాక్‌ ప్రధాని

Eenadu

Operation sindoor: అవును.. భారత్‌ క్షిపణుల దెబ్బ మాకు తగిలింది: పాక్‌ ప్రధాని"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’తో దాయాది పాకిస్థాన్‌ వణికిపోయింది. మన మిలిటరీ దాడులు ఆ దేశ వైమానిక దళాన్ని


చావుదెబ్బ కొట్టాయి. శత్రువుల కీలక వైమానిక స్థావరాలను మన క్షిపణులు ధ్వంసం చేశాయి. అయితే, ఈ నష్టంపై ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తోన్న పాక్‌ (Pakistan).. తాజాగా దాన్ని అంగీకరించింది. భారత క్షిపణుల


దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) ధ్రువీకరించారు. శుక్రవారం రాత్రి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ షెహబాజ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. మే 9-10 మధ్య రాత్రి


సమయంలో రావిల్పిండిలోని నూర్ ఖాన్‌ సహా ఇతర వైమానిక స్థావరాలపై భారత్‌ దాడి చేసినట్లు పాక్‌ ప్రధాని అంగీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. *


చర్చించుకుందాం.. పరిష్కరించుకుందాం: షెహబాజ్‌ ఆ సయమంలో ఈత కొడుతున్నా..: షెహబాజ్‌ ‘‘ఆ రోజు తెల్లవారుజామున ప్రార్థనలు ముగించుకుని ఈత కొట్టేందుకు వెళ్లా. నా సెక్యూర్డ్‌ ఫోన్‌ మాత్రమే


తీసుకెళ్లా. రెండు సార్లు మోగింది. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ లైన్‌లో ఉన్నారు. ఫోన్‌ ఎత్తగానే భారత్‌ దాడులు చేస్తున్న విషయాన్ని చెప్పారు. వాటిని ఎదుర్కొనేందుకు వైమానిక దళం స్వదేశీ


సాంకేతిక పరిజ్ఞానంతో పాటు చైనా యుద్ధ విమానాలను కూడా వినియోగిస్తోందని మునీర్‌ తెలిపారు’’ అంటూ షెహబాజ్ వివరించారు. అయితే, భారత్‌పై పాక్‌ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు కూలిపోయిన విషయాన్ని


మాత్రం ఆయన చెప్పకపోవడం గమనార్హం. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత సైనిక స్థావరాలు, పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్‌ దాడి చేసింది. దీంతో న్యూదిల్లీ ప్రతిదాడికి దిగింది. అత్యంత కచ్చితత్వంతో


పాక్‌లోని  దాదాపు డజను సైనిక స్థావరాలను భారత్‌ ధ్వంసం చేసింది. ఇందులో ఆ దేశానికి అత్యంత కీలకమైన పాక్‌ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ ఉన్న చక్లాలలోని నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌తో పాటు సర్గొదా, భోలారీ


వైమానిక స్థావరాలున్నాయి. దాడుల్లో ఇవి ధ్వంసమైన తీరు ఉపగ్రహ చిత్రాల్లో బయటికొచ్చింది. పాక్‌ వాయుసేనకు చెందిన దాదాపు ఐదోవంతు మౌలిక వసతులు, ఫైటర్‌ జెట్లు భారత్‌ దాడిలో ధ్వంసమైనట్లు సమాచారం.


Trending News

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Kuldeep yadav | latest kuldeep yadav - eenadu

ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు: రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌, ఫైనల్స్‌లో భారత స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ...

వీధి శునకాల లెక్క పక్కాగా!

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో వీధి కుక్కల బెడద అంతాఇంతా కాదు. వీటి దాడుల్లో తరచూ ఎంతోమందికి గాయాలవుతూనే ఉన్నాయి. అడపాదడ...

హలో.. మేము ఏసీబీ!  

నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడుతున్న పోలీసులు అధికారులు కర్నూలు (టౌన్‌): ‘హలో..  నేను ఏసీబీ డీఎస్పీ..  విజ...

Latests News

Operation sindoor: అవును.. భారత్‌ క్షిపణుల దెబ్బ మాకు తగిలింది: పాక్‌ ప్రధాని

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’తో దాయాది పాకి...

Vodafone idea: సుప్రీంలో టెల్కోలకు షాక్‌.. వొడాఫోన్‌ ఐడియా షేర్లు డౌన్‌

Vodafone Idea | దిల్లీ: టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (AGR) బకాయిల నుంచి ఊ...

Krishna and ntr district news - eenadu

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, w...

Kerala's V. Muraleedharan to join Modi ministry

Become a MemberDark ModeBecome a MemberOperation SindoorRaghav's TakeState of EducationUncovering HateQisse KahaniyaanCl...

Vizag steel plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ముందుకే: దీపమ్‌ కార్యదర్శి

Vizag Steel plant sale: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విక్రయించే విషయంలో కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని మరోసారి తేలింది. ...

Top