Ipl 2025: డీజేలు, చీర్‌ లీడర్స్‌ లేకుండానే మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లు

Eenadu

Ipl 2025: డీజేలు, చీర్‌ లీడర్స్‌ లేకుండానే మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లు"

Play all audios:

Loading...

భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ కోరిక మేరకు మిగిలిన 17 ఐపీఎల్‌ మ్యాచ్‌లను డీజేలు, చీర్‌లీడర్స్‌ లేకుండానే బీసీసీఐ నిర్వహించాలనుకుంటున్నట్లు సమాచారం ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌,


పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల ధర్మశాలలో పంజాబ్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ మధ్యలోనే అర్ధంతరంగా ఆగిపోయింది. మిగతా ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌లు కూడా ఓ వారానికి


వాయిదా పడ్డాయి. భారత్‌, పాక్‌ మధ్య మే 10న కాల్పుల విరమణకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో మిగిలిన 17 ఐపీఎల్‌ మ్యాచ్‌లను మే 17 నుంచి నిర్వహించనున్నారు.  పునఃప్రారంభం కానున్న ఐపీఎల్‌


మ్యాచ్‌లను డీజేలు, చీర్‌ లీడర్స్‌ లేకుండానే నిర్వహించాలని భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar), బీసీసీఐకి(BCCI) సూచించాడు. పాక్‌ మూలాలున్న ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకుల


మీద జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకోవాలని కోరాడు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ.. హంగు, ఆర్భాటాలు లేకుండా మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించేందుకు


సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఆరు వేదికల్లో మిగతా ఐపీఎల్‌ మ్యాచ్‌లు... చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bengaluru), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌


(Kolkata Knight Riders) మధ్య మే 17న జరగనున్న మ్యాచ్‌తో ఐపీఎల్‌ పునఃప్రారంభం కానుంది. మిగతా మ్యాచ్‌లు దిల్లీ, జైపుర్‌, అహ్మదాబాద్‌, ముంబయి, బెంగళూరు, లఖ్‌నవూ వేదికగా జరగనున్నాయి. లీగ్‌


మ్యాచ్‌లు మే 27న ముగియనున్నాయి. ప్లేఆఫ్స్‌ మే 29న ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జూన్‌ 3న జరగనుంది. అయితే విదేశీ ప్లేయర్లు ప్లేఆఫ్స్‌లో పాల్గొనే విషయంలో మాత్రం అనిశ్చితి


కొనసాగుతోంది.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్‌ (23/05/2025)

23/05/2025 11:09(IST) ఏపీ మద్యం కుంభకోణం.. రాజ్‌ కెసిరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు రాజ్‌ కెసిరెడ్డి, ఆయన తండ్రి ఉపేంద్రర...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

Latests News

Asia cup | latest asia cup - eenadu

ASIA CUP 2023: ఆసియా కప్‌.. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్స్‌కు భారీ నజరానా ఆసియా కప్‌ టోర్నీ (Asia Cup 2023)లో భాగంగా కొలం...

Alla ramakrishnaredy: తెదేపా కార్యాలయంపై దాడి ఘటన.. ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు

మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు...

Ap news: ఏపీపీఎస్సీ కేసు.. రెండో రోజు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు విచారణ

అమరావతి: ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో నిందితుడు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును పోలీసులు రెండో రోజు విచారించనున్నారు. పీఎస్‌ఆర్‌ ఆంజ...

Viral video: ఈ వీడియో చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే.. స్పందించిన కేంద్ర మంత్రి

చేతికొచ్చిన పంట వర్షంలో కొట్టుకుపోతుంటే ఓ రైతు భారీ వర్షాన్ని లెక్కచేయక పంటను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించాడు. ఈ వీడి...

Ktr: ఎన్డీయే ప్రభుత్వం ఈసారైనా రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటుందా? : కేటీఆర్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) విమర్శించారు. దర్...

Top