Ipl 2025: డీజేలు, చీర్ లీడర్స్ లేకుండానే మిగతా ఐపీఎల్ మ్యాచ్లు
Ipl 2025: డీజేలు, చీర్ లీడర్స్ లేకుండానే మిగతా ఐపీఎల్ మ్యాచ్లు"
Play all audios:
భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కోరిక మేరకు మిగిలిన 17 ఐపీఎల్ మ్యాచ్లను డీజేలు, చీర్లీడర్స్ లేకుండానే బీసీసీఐ నిర్వహించాలనుకుంటున్నట్లు సమాచారం ఇంటర్నెట్ డెస్క్: భారత్,
పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే అర్ధంతరంగా ఆగిపోయింది. మిగతా ఐపీఎల్ (IPL) మ్యాచ్లు కూడా ఓ వారానికి
వాయిదా పడ్డాయి. భారత్, పాక్ మధ్య మే 10న కాల్పుల విరమణకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో మిగిలిన 17 ఐపీఎల్ మ్యాచ్లను మే 17 నుంచి నిర్వహించనున్నారు. పునఃప్రారంభం కానున్న ఐపీఎల్
మ్యాచ్లను డీజేలు, చీర్ లీడర్స్ లేకుండానే నిర్వహించాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar), బీసీసీఐకి(BCCI) సూచించాడు. పాక్ మూలాలున్న ఉగ్రవాదులు పహల్గాంలో పర్యాటకుల
మీద జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకోవాలని కోరాడు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ.. హంగు, ఆర్భాటాలు లేకుండా మిగతా ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు
సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు వేదికల్లో మిగతా ఐపీఎల్ మ్యాచ్లు... చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru), కోల్కతా నైట్ రైడర్స్
(Kolkata Knight Riders) మధ్య మే 17న జరగనున్న మ్యాచ్తో ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. మిగతా మ్యాచ్లు దిల్లీ, జైపుర్, అహ్మదాబాద్, ముంబయి, బెంగళూరు, లఖ్నవూ వేదికగా జరగనున్నాయి. లీగ్
మ్యాచ్లు మే 27న ముగియనున్నాయి. ప్లేఆఫ్స్ మే 29న ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది. అయితే విదేశీ ప్లేయర్లు ప్లేఆఫ్స్లో పాల్గొనే విషయంలో మాత్రం అనిశ్చితి
కొనసాగుతోంది.
Trending News
Trump-musk: ఆ విషయంలో మస్క్ కత్తి వాడాలి.. గొడ్డలి కాదు: ట్రంప్వృథా ఖర్చులను అరికట్టే సాకుతో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారంటూ మస్క్పై వస్తున్న విమర్శలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ...
తొలుత లాభాలు- తుదకు నష్టాలుకోవిడ్-19 సృష్టిస్తున్న కల్లోలంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనట్లు ఆర్బీఐ తాజాగా పేర్కొంది. దీంతో ఆర్థిక పురోగతికి వీలుగా రె...
Technology | latest tech news today - eenaduఐఫోన్ డేటా బదిలీ సులువుగా.. కొత్త ఐఫోన్ కొన్నారా? పాత ఐఫోన్ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారా? థర్డ్...
సేవా సైనికులు.. మీకు సెల్యూట్: సీఎం జగన్సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు పొందిన వలంటీర్లతో సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సేవా దృక్పథం, మంచి చేయాలన్న తపనన...
రాజమండ్రిలో రుచి చూసిన జైలు జీవితంఆనం కళాకేంద్రంలో రావి కొండలరావును సన్మానిస్తున్న జిత్ మోహన్ మిత్రా(ఫైల్) _ఆయనో సినీ విజ్ఞాని. స్క్రీన్ప్లే, కథ, కథనా...
Latests News
Ipl 2025: డీజేలు, చీర్ లీడర్స్ లేకుండానే మిగతా ఐపీఎల్ మ్యాచ్లుభారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కోరిక మేరకు మిగిలిన 17 ఐపీఎల్ మ్యాచ్లను డీజేలు, చీర్లీడర్స్ లేకుండానే బీసీసీఐ...
Ipl 2025: ఐపీఎల్ పునఃప్రారంభానికి పొంచి ఉన్న వాన ముప్పుఈ రోజు రాత్రి 7:30 గంటలకు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కోల్కతా నైట్రైడర్స్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు వ...
పీఎన్బీ స్కాం: చోక్సీకి భారీ షాక్వేలకోట్ల రూపాయల మేర పీఎన్బీ బ్యాంకునకు కుచ్చుటోపీ పెట్టి, ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న చోక్సీ పౌరసత్వాన్ని ఆంటిగ్వా అండ్ ...
Miss canada: పాతబస్తీ అగ్నిప్రమాద ఘటన.. హృదయం బరువెక్కింది: మిస్ కెనడాహైదరాబాద్: చార్మినార్ సమీపంలోని గుల్జార్హౌజ్ చౌరస్తా వద్ద ఓ భవనంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ...
Operation sindoor: ఈసారి భారత్ ఏం చేస్తుందో పాకిస్థాన్కు తెలుసు - వైస్ అడ్మిరల్పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)ను పాక్ సైన్యం దాటలేదని భారత త్రివిధ దళాలు స్పష్టంచేశాయి. ఆపరేషన్ సమయంలో లక్ష్యాలను ...