Amit shah: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఉగ్రవాదానికి దీటైన జవాబు: అమిత్‌ షా

Eenadu

Amit shah: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఉగ్రవాదానికి దీటైన జవాబు: అమిత్‌ షా"

Play all audios:

Loading...

పహల్గాం దాడులతో అన్ని హద్దులూ దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి.. వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసిందని అమిత్‌ షా (Amit Shah) పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ డెస్క్‌:


పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) ఉగ్రవాదానికి దీటైన జవాబు అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) పేర్కొన్నారు. పహల్గాం దాడులతో అన్ని


హద్దులూ దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి.. వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసిందన్నారు. పాక్‌లో ఉన్న ఉగ్రస్థావరాలను భారత్‌ బయటపెట్టడంతో.. ఆ దేశం ఉగ్రవాదులను పోషిస్తుందనే


నిజం మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రపంచమంతా కొనియాడిందని షా పేర్కొన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీ బలమైన రాజకీయ సంకల్పం..


నిఘా సంస్థలు అందించిన కచ్చితమైన సమాచారం.. త్రివిధ దళాల అద్భుత ప్రదర్శన వల్లే ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతం అయ్యిందని అమిత్‌ షా అన్నారు.  పాక్‌.. భారత్‌పై క్షిపణులు ప్రయోగించిన సమయంలో దేశాన్ని


కాపాడడంలో బీఎస్‌ఎఫ్‌ దళాలు ముఖ్యపాత్ర పోషించాయని అమిత్‌ షా అన్నారు. బంగ్లాదేశ్‌తో సహా అంతర్జాతీయ సరిహద్దులను కాపాడటంలో బీఎస్‌ఎఫ్ పాత్రను అభినందించారు.  పాకిస్థాన్‌ చేస్తున్న తప్పిదాల వల్ల


భారత్‌ అనేక దశాబ్దాలుగా ఉగ్ర సమస్యను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి భారత్‌ ఉగ్ర దాడులకు గట్టి బదులిస్తోందని అన్నారు. పహల్గాం ఘటన సమయంలో ఉగ్రవాదులు పర్యాటకులను


మతం అడిగి మరీ చంపడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. ఆపరేషన్ సిందూర్‌లో 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని.. వాటిలో 2 వాటి ప్రధాన ఉగ్ర కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ


దాడిలో పాక్‌ ప్రజలకు గానీ, సైనిక స్థావరాలకు గానీ ఎటువంటి నష్టం కలిగించలేదని స్పష్టంచేశారు. కానీ పాక్‌ సైన్యం మాత్రం నిషేధిత ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరై.. ఉగ్రవాదానికి మద్దతు పలికారని


అమిత్‌షా అన్నారు. వారి చర్యలను ప్రపంచం మొత్తం చూసిందని.. ఉగ్రవాదుల వెనక ఎవరు ఉన్నారనే విషయం అన్ని దేశాలకు అర్థమయ్యిందని తెలిపారు. 1965 నుంచి నేటివరకు దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలు


అర్పించిన  2,000 మందికి పైగా సరిహద్దు గార్డులకు దేశం తరఫున నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.


Trending News

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగు

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Latests News

Amit shah: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఉగ్రవాదానికి దీటైన జవాబు: అమిత్‌ షా

పహల్గాం దాడులతో అన్ని హద్దులూ దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి.. వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేస...

Amritsar: అమృత్‌సర్‌లో బాంబు పేలుడు.. అనుమానిత ఉగ్రవాది మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. నగర బైపాస్‌కు సమీపంలో ఓ వ్యక్తి బాంబు పెట్...

Supreme court: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు మూడు రోజుల్లో భారత్‌కు రావాలని సుప్రీం ఆదేశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచా...

Rapo22: ట్రెండింగ్ టైటిల్‌తో వచ్చేసిన రామ్‌.. కొత్త సినిమా పేరిదే..

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో రామ్‌ నటిస్తోన్న సినిమా (#RAPO22) పేరు ఖరారైంది. నేడు ఈ యంగ్‌ హీరో పుట్టినర...

Joe biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్‌ నిర్ధరణ

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆయన కార...

Top