Pm modi: ఇది పేదల ప్రభుత్వం.. ఆత్మనిర్భర్‌కు కట్టుబడ్డాం: ప్రధాని మోదీ

Eenadu

Pm modi: ఇది పేదల ప్రభుత్వం.. ఆత్మనిర్భర్‌కు కట్టుబడ్డాం: ప్రధాని మోదీ"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: పేద ప్రజల సంక్షేమానికి ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వెల్లడించారు. ఎన్‌డీఏ దశాబ్ద కాలంగా సాగిన పాలనలో ప్రజలను


పేదరికం నుంచి బయటపడేయటానికి, వారు స్వయంసమృద్ధి సాధించేందుకు పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొన్నట్లు ఆయన అభివర్ణించారు.  ప్రతిఒక్కరూ గౌరవంగా జీవించడానికి వీలుగా.. సమ్మిళిత, స్వయంసమృద్ధి


భారత్‌ను తయారుచేసేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాము ప్రవేశపెట్టిన అన్ని పథకాలు పేదల జీవితాలను మార్చాయన్నారు. ‘‘పీఎం ఆవాస్‌ యోజన, పీఎం ఉజ్వల యోజన,


జన్‌ధన్‌, ఆయుష్మాన్‌ భారత్‌ వంటివి ప్రజలకు ఇళ్లు, స్వచ్ఛమైన ఇంధనం, బ్యాంకింగ్‌, హెల్త్‌కేర్‌, గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించాయి.  25 కోట్ల మందికి పైగా పేదరికం నుంచి బయటపడ్డారు’’ అని


పేర్కొన్నారు.  మోదీ సర్కార్‌ 3.0 ఏర్పడి జూన్‌ 9 నాటికి ఏడాది పూర్తికానుంది. దీంతో ఆయన 11 ఏళ్లపాటు నిరంతరాయంగా ప్రధాని పదవిలో కొనసాగినట్లవుతుంది. ఈసందర్భంగా బుధవారం ఏర్పాటుచేసిన మంత్రివర్గ


సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. ఉన్నతమైన లక్ష్యాలు నిర్దేశించుకొని.. వాటిని సాధించేందుకు ఉత్సాహంగా పనిచేయాలని సహచరులకు సూచించారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.


Trending News

Pm modi: ఇది పేదల ప్రభుత్వం.. ఆత్మనిర్భర్‌కు కట్టుబడ్డాం: ప్రధాని మోదీ

ఇంటర్నెట్‌డెస్క్‌: పేద ప్రజల సంక్షేమానికి ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సామాజిక మాధ్యమం...

Latests News

Pm modi: ఇది పేదల ప్రభుత్వం.. ఆత్మనిర్భర్‌కు కట్టుబడ్డాం: ప్రధాని మోదీ

ఇంటర్నెట్‌డెస్క్‌: పేద ప్రజల సంక్షేమానికి ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సామాజిక మాధ్యమం...

Top