Army: కాల్పుల మోత లేదు.. 19 రోజుల తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతత

Eenadu

Army: కాల్పుల మోత లేదు.. 19 రోజుల తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతత"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది. గత రాత్రి ఇక్కడ ఎలాంటి కాల్పుల మోత మోగలేదని, షెల్లింగ్‌ జరగలేదని భారత సైన్యం


(Indian Army) వెల్లడించింది. పహల్గాం దాడి తర్వాత నుంచి ఎల్‌ఓసీ వద్ద అలజడి నెలకొనగా.. 19 రోజుల తర్వాత నిన్న రాత్రి ప్రశాంతంగా గడిచిందని తెలిపింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’


తర్వాత సైనిక ఘర్షణను ఆపేందుకు భారత్‌-పాకిస్థాన్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని గంటలకే పాక్‌ (Pakistan) దాన్ని ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది.


దీనిపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతో దాయాది దేశం వెనక్కి తగ్గింది. దీంతో జమ్మూకశ్మీర్‌లోని నిన్న రాత్రి ఎలాంటి కాల్పులు జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు, ఇతర


ప్రాంతాల వెంబడి రాత్రి ప్రశాంతంగా గడిచినట్లు పేర్కొంది.  * మన సైనిక సత్తా చాటాం.. రావల్పిండి వరకు వినిపించాం పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఏప్రిల్‌ 24 నుంచి ప్రతి రోజూ పాక్‌ కాల్పులకు తెగబడిన


సంగతి తెలిసిందే. ఇక, భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. పౌర నివాసాలే లక్ష్యంగా దాయాది సైన్యం మోర్టార్‌ షెల్స్‌తో దాడులకు దిగింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఘర్షణలు


తీవ్రస్థాయికి చేరడంతో భద్రతా దళాలు సరిహద్దు ప్రాంతాల నుంచి పౌరులను ఖాళీ చేయించారు. దీంతో గత కొద్ది రోజులుగా వారు సురక్షిత ప్రాంతాల్లోనే తలదాచుకుంటున్నారు. అయితే, ఇప్పుడే స్వస్థలాలకు


వెళ్లొద్దని సరిహద్దు గ్రామప్రజలను జమ్మూకశ్మీర్‌ యంత్రాంగం హెచ్చరించింది. పేలని షెల్స్‌ ఇంకా ఉంటాయని, వాటిని గుర్తించాల్సి ఉందని పేర్కొంది. ఇక, పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న ఇతర


రాష్ట్రాల్లోనూ నిన్న రాత్రి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. అయినప్పటికీ భద్రతా బలగాలు పూర్తిస్థాయి అప్రమత్తతతో ఉన్నాయి.


Trending News

Vindhya expressway to connect bhopal with singrauli via damoh, rewa, sidhi as madhya pradesh cm announces new project

Industrial clusters will also be developed along this proposed Vindhya expressway to provide employment to youths from t...

పేదవారి ఆకలి తీర్చటమే వీరి ధ్యేయం..

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Nandamuri Taraka Ratna critical after cardiac arrest, says hospital

Actor Nandamuri Taraka Ratna, who suffered a cardiac arrest on Friday, January 27, is now in a critical state, according...

విశాఖపట్నంలో తొలి రామాలయం ఇదే... ఎక్కడ ఉందో తెలుసా?

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Post office scheme: పోస్టాఫీసులో అద్భుత స్కీం.. రూ. లక్ష పెట్టుబడి పెడితే.. రూ. 2లక్షలు లాభం..

ప్రస్తుతం దీనిలో 6.9 శాతం వడ్డీ ఉంది. కిసాన్ వికాస్ పత్రను సర్టిఫికేట్ రూపంలో కొనుగోలు చేయాలి. ఇవి రూ.1000, రూ.5వేలు, రూ...

Latests News

Army: కాల్పుల మోత లేదు.. 19 రోజుల తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతత

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది. గత రాత్రి ఇక్...

Scary bridge: ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వంతెన.. దీన్ని చూస్తేనే చాలు గుండె గుభేల్ మంటుంది..!

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Malavika Mohanan excited to work with Rajinikanth in 'Petta'

Actress Malavika Mohanan, daughter of renowned cinematographer TU Mohanan, makes her Tamil debut opposite superstar Raji...

Odisha news | latest odisha news - eenadu

ఇంటి తాళాలు విరగొట్టి బంగారం, నగదు చోరీ కోరాపుట్ జిల్లా సిమిలిగుడలో కుశల్ ఆశ్రమం సమీపంలో ఒక ఇంటి తాళాలు విరగొట్టి భారీ ఎ...

Latest telugu news | breaking news telugu | telugu news today | news in telugu - eenadu

ఇంటి నుంచి పని... పొడిగించుకోవచ్చా? నేను మూడేళ్లక్రితం ఉద్యోగంలో చేరా. అప్పటినుంచీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నా. ఈ మధ్...

Top