Covid 19: దేశంలో 4 వేలకు చేరువైన కొవిడ్ కేసులు
Covid 19: దేశంలో 4 వేలకు చేరువైన కొవిడ్ కేసులు"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కొవిడ్(Corona virus) వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం జూన్ 2న ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య
3,900 మార్కును దాటి.. నాలుగు వేలకు చేరువలో ఉంది. కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్లలో కూడా కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేరళ, కర్ణాటకలో ఈ ఇన్ఫెక్షన్తో తాజాగా
రెండు మరణాలు సంభవించినట్లు తెలిపారు. దీంతో 2025 జనవరి నుంచి దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 32కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,188 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు పేర్కొన్నారు.
కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 24 గంటల్లో 360 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయన్నారు. కాగా దేశంలో పెరుగుతున్న కొవిడ్
కేసులపై ఇటీవల ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) స్పందిస్తూ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందన్న సూచనలు ఏమీ లేవని పేర్కొంది.
ఇప్పటికే ఆమోదం పొందిన కొవిడ్ వ్యాక్సిన్లు ఈ వేరియంట్ లక్షణాలు, ప్రభావాన్ని కట్టడి చేయడంలో సమర్థంగా పనిచేస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రాల వారీగా కొవిడ్ కేసులు ఇలా..
డేటాబోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,961గా ఉండగా, కేరళలో అత్యధికంగా 1,435 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 506 యాక్టివ్ కేసులు ఉండగా.. ఏడుగురు
మరణించారు. దిల్లీలో 483, పశ్చిమబెంగాల్లో 339, గుజరాత్లో 338, తమిళనాడులో 199, ఉత్తరప్రదేశ్లలో 149, ఒడిశా 12, గురుగ్రామ్ 12, పంజాబ్ 6లో కేసులు నమోదయ్యాయి.
Trending News
‘బాబుని సీఎం చేయాలని గవర్నర్కి లేఖ రాస్తారేమో’సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి ...
‘Aatmanirbharta’ named Oxford Hindi word of 2020‘Aatmanirbharta’ implying self-reliance has been named by Oxford Languages as its Hindi word of the year 2020 as it “val...
Ipl 2025: పరుగుల వీరుడు అతడేనా..? వికెట్ల ధీరుడిగా నిలిచేదెవరు?ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) నాకౌట్ స్టేజ్కు చేరుకుంది. తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్లు...
Arvind kejriwal: కేజ్రీవాల్ పార్లమెంట్ ఎంట్రీ..? పార్టీ ఏం చెప్పిందంటే..దిల్లీ: దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఇక పార్లమెంట్ల...
Oneplus | latest oneplus - eenaduమడతే.. మజా! ఇది మూడో తరం ఫోల్డబుల్ ఫోను. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెనరేషన్ సీపీయూ, భారీ స్టోరేజీ ర్యామ్ దీని సొం...
Latests News
Covid 19: దేశంలో 4 వేలకు చేరువైన కొవిడ్ కేసులుఇంటర్నెట్ డెస్క్: దేశంలో కొవిడ్(Corona virus) వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప...
Kerala music director issac thomas kottukapally passes away in chennaiIssac Thomas Kottukapally has composed music for many Malayalam films including Shaji N Karun’s _Kutty Srank_ (2009) wit...
Ilaiyaraaja gets Padma Vibhushan: Full list of 2018 Padma awardeesMusic director Isaignani Ilaiyaraaja will be awarded the Padma Vibhushan award at the Republic Day celebrations on Frida...
నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్ (02/06/2025)02/06/2025 23:20(IST) కర్నూలు నాలుగో పట్టణ సీఐ, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ * సీఐ మధుసూదన్ గౌడ్, హెడ్ కానిస్టేబుల...
Assam career : binandi chandra medhi college recruitment 2024Applications are invited for recruitment of various administrative positions or career in Binandi Chandra Medhi College ...