Pakistan: 50 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు యత్నం..
Pakistan: 50 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు యత్నం.."
Play all audios:
ఇంటర్నెట్డెస్క్: ఆపరేషన్ సిందూర్ జోరుగా జరుగుతున్న వేళ పెద్ద సంఖ్యలో ఉగ్రమూకను భారత్లోకి పంపేందుకు పాక్ యత్నించింది. ఈ విషయాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ధ్రువీకరించింది. మే 8వ
తేదీన 45-50 మంది ఉగ్రవాదులను సరిహద్దులు దాటించి భారత్లోకి పంపించేందుకు పాక్ దళాలు తీవ్రంగా యత్నించాయి. ఇందుకోసం భారీగా షెల్లింగ్ కూడా చేపట్టినట్లు పేర్కొన్నాయి. బీఎస్ఎఫ్ డిప్యూటీ
ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఎస్ మండ్ ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘మా జవాన్లు వారికి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించారు. పెద్ద ఎత్తున ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు వస్తున్నట్లు మా
వద్ద ముందే సమాచారం ఉంది. వారి కోసం కాచుకు కూర్చొని.. గుర్తించగానే దాడులు నిర్వహించాము. ఆ గ్రూపులో దాదాపు 45-50 మంది వరకు ఉన్నారు. వారు మా వైపునకు వచ్చారు. దీంతో అదును చూసి వారిపై
తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాము. మేము ఊహించినట్లే తమ పోస్టుల నుంచి వారు భారీ స్థాయిలో కాల్పులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మేము అత్యంత కచ్చితత్వంతో కాల్పులు జరిపాము. దీంతో వారు తమ పోస్టులను
వదిలేసి పలాయనం చిత్తగించారు. దాదాపు గంటన్నరలోనే వారికి మేము బుద్ధి చెప్పాము. వారి బంకర్లు, ఆయుధాలను ధ్వంసం చేశాము. వారు మరోసారి వస్తే పదింతల శక్తితో తిప్పికొట్టేందుకు మా జవాన్లు సిద్ధంగా
ఉన్నారు. ఇందుకు సంబంధించి బీఎస్ఎఫ్కు స్పష్టమైన ఆదేశాలున్నాయి. బీఎస్ఎఫ్లోని మహిళా జవాన్లు కూడా పురుషులతో సమానంగా శత్రువులపై పోరాడే బాధ్యతలను నిర్వహించారు. వారిని చూస్తే మాకు గర్వంగా
ఉంది’’ అని డీఐజీ వెల్లడించారు. బుధవారం పూంచ్లోని బ్రిగేడ్ హెడ్క్వార్టర్ను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్మీ, బీఎస్ఎఫ్ సిబ్బందితో ఆయన భేటీ అయ్యారు.
ఆపరేషన్ సిందూర్ వేళ జమ్మూకశ్మీర్లోని సాంబ జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్ఎఫ్ తిప్పికొట్టింది. మే 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సాంబ
జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఈ పరిణామాలు చోటుచేసుకొన్నట్లు బీఎస్ఎఫ్ ఎక్స్ పోస్టులో వెల్లడించింది. కనీసం ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
జూమ్ వర్సెస్ జియోమీట్తమ యాప్ను కాపీ కొట్టారన్న జూమ్ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్కు దీటుగా రిలయన్స్ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...
Latests News
Pakistan: 50 మంది ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు యత్నం..ఇంటర్నెట్డెస్క్: ఆపరేషన్ సిందూర్ జోరుగా జరుగుతున్న వేళ పెద్ద సంఖ్యలో ఉగ్రమూకను భారత్లోకి పంపేందుకు పాక్ యత్నించింద...
Omc case: ఓఎంసీ కేసు.. గాలి జనార్దన్రెడ్డి, మరో ముగ్గురి బెయిల్ పిటిషన్లపై సీబీఐ కౌంటర్ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితులైన గాలి జనార్దన్రెడ్డి (Gali Janardhan Reddy), మరో ముగ్గురి బెయిల్ పిటిషన్లపై స...
Jharkhand: ఝార్ఖండ్లో ఎదురుకాల్పులు.. మావోయిస్టు అగ్రనాయకుడు మృతిఝార్ఖండ్లోని లతేహార్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇంటర్నెట్డెస్క్: ఝార్ఖండ్ (jharkhand)...
Brs: కవితలో ఇంత ఆవేదన ఉందని ఇవాళే తెలిసింది: భారాస నేత వినోద్రాజకీయాల్లో ప్రకంపనలు సహజమని, చాలా పార్టీలో ఇలాంటి ప్రకంపనలు చూశామని మాజీ ఎంపీ, భారాస నేత వినోద్ కుమార్ అన్నారు. హైదరా...
Mini mahanadu: ఫ్రీమాంట్లో ‘మినీ మహానాడు-2025’ గ్రాండ్ సక్సెస్కాలిఫోర్నియా: తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలతోపాటు ‘ మినీ మహానాడు-2025’ కార్యక్రమాన్ని కాలిఫోర...