Spy network: పాకిస్థాన్కు గూఢచర్యం.. రెండు వారాల్లో 12 మంది అరెస్టు
Spy network: పాకిస్థాన్కు గూఢచర్యం.. రెండు వారాల్లో 12 మంది అరెస్టు"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్వర్క్ (Spy Network)పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని అరెస్టు
చేశారు. పంజాబ్లో ఆరుగురు, హరియాణాలో ఐదుగురు, ఉత్తర్ప్రదేశ్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
నిందితులు పాక్ నిఘావర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందన్నారు. వారి ఆర్థిక లావాదేవీలను సునిశితంగా పరిశీలిస్తున్నామని, ఎలక్ట్రానిక్
పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా జరుగుతోందని చెప్పారు. * పాక్ అనుకూల ప్రచారం వ్యాప్తి కోసం.. జ్యోతి మల్హోత్రాకు ఆదేశాలు..! * మే 4న పంజాబ్లోని అజ్నాలా, అమృత్సర్లకు చెందిన ఫలక్షేర్
మసిహ్, సూరజ్ మసిహ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాల ఫొటోలు, బలగాల కదలికలు, బీఎస్ఎఫ్ క్యాంపుల లొకేషన్లు తదితర సున్నిత సమాచారాన్ని పాకిస్థాన్
నిఘాసంస్థ ‘ఐఎస్ఐ’కు చేరవేస్తున్నారనే ఆరోపణలున్నాయి. * మే 11న పంజాబ్లోని మలేర్కోట్లకు చెందిన గుజాలా అనే యువతి, యామిన్ మహమ్మద్ అరెస్టయ్యారు. దిల్లీలోని పాక్ హైకమిషన్లో పనిచేసి, ఇటీవల
బహిష్కరణకు గురైన ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. రహస్య సమాచారం చేరవేతకు బదులుగా ఆన్లైన్లో డబ్బు పొందుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. * మే 15న
పంజాబ్కు చెందిన సుఖ్ప్రీత్ సింగ్, కరణ్బీర్ సింగ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన రహస్య సమాచారాన్ని, బలగాల కదలికలను, వ్యూహాత్మక ప్రాంతాల సమాచారాన్ని ఐఎస్ఐకు
చేరవేసినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. ఇదే రోజు హరియాణాలోని పానిపత్ జిల్లాలో 24 ఏళ్ల నౌమాన్ ఇలాహి అరెస్టయ్యాడు. ఉత్తర్ప్రదేశ్లోని కైరానాకు చెందిన
అతడు ఐఎస్ఐతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. * మే 16న హరియాణాలోని కైథల్ జిల్లాకు చెందిన దేవేందర్ సింగ్ అరెస్టయ్యాడు. ఆయుధాలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడనే
ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న అతడు.. గతేడాది పాకిస్థాన్కు వెళ్లాడని, ఈ క్రమంలోనే అక్కడి నిఘావర్గాలతో పరిచయం ఏర్పరుచుకుని.. వారితో టచ్లో
ఉన్నాడని పోలీసులు ఆరోపించారు. పటియాలా కంటోన్మెంట్కు సంబంధించిన కొన్ని ఫొటోలను పంపినట్లు అతడు అంగీకరించాడన్నారు. * మే 16నే హరియాణాలోని హిసార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు
చేశారు. పహల్గాం దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్థాన్లో పర్యటించిందని, ఒకసారి చైనాకూ వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో డానిష్తో
ఆమె టచ్లో ఉన్నట్లు నిర్ధరించారు. పహల్గాం ఘటనకు ముందు అక్కడికి వెళ్లి వీడియోలు తీసినట్లు సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. * మే 17న
హరియాణాలోని నుహ్ జిల్లాలో 26 ఏళ్ల అర్మాన్ అరెస్టయ్యాడు. పాక్ హైకమిషన్లోని ఉద్యోగి ద్వారా భారత సైన్యం, ఇతర సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నందుకు అతడిపై చర్యలు
తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం నుహ్ పోలీసులు మరో వ్యక్తినీ అరెస్టు చేశారు. * మే 18న సరిహద్దు అక్రమ రవాణా, గూఢచర్యం ఆరోపణలపై షెహజాద్ అనే వ్యక్తిని ఆదివారం ఉత్తర్ప్రదేశ్లోని
రాంపుర్లో మొరాదాబాద్ యూనిట్ ఎస్టీఎఫ్ అరెస్టు చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేస్తున్నాడని తెలిపింది. అనేకసార్లు పాక్కు ప్రయాణించి సౌందర్య సాధనాలు,
దుస్తులు, సుగంధ ద్రవ్యాలు ఇతర వస్తువులను అక్రమంగా రవాణా చేస్తున్నాడని ఆరోపించింది.
Trending News
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Urvashi rautela: కేన్స్ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలాకేన్స్ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్ విడుదల చ...
Andhra top news | latest andhra pradesh news - eenaduవెన్నుపోటు, గొడ్డలివేటుకు పేటెంట్ జగన్ వెన్నుపోటు, గొడ్డలివేటుపై జగన్కే పేటెంట్లు ఉన్నాయని, ఆయన గురించి తెలిసే తల్లి,...
Cannes 2025: కేన్స్లో అడుగుపెట్టిన అలియా.. ఫొటోలు షేర్ చేసిన నటిఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటి అలియా భట్ (Alia Bhatt) కేన్స్ వేదికపై హొయలొలికించారు. తొలిసారి ఈ వేడుకలకు హాజరైన అలియా...
Bmw: దేశమంతా ఒకే ధరకు bmw ఎలక్ట్రిక్ సెడాన్ i7BMW ఇండియా తన ఎలక్ట్రిక్ సెడాన్ BMW i7ను భారత్లో అన్ని రాష్ట్రాలలో ఒకే ఎక్స్-షోరూమ్ ధర(రూ.2.05 కోట్ల)కు అందించనున్నట్లు...
Latests News
Spy network: పాకిస్థాన్కు గూఢచర్యం.. రెండు వారాల్లో 12 మంది అరెస్టుఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్వర్క్ (Spy Network)పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు...
Fitness | latest fitness - eenaduపింక్ బాల్, జంపింగ్ జాక్స్, తాయ్చీ... ఆరోగ్యంపై కసరత్తు! సన్నగా, నాజూగ్గా ఉండాలన్నా, అందంగా కనిపించాలన్నా, ఒత్తిళ్ల న...
Rare surgery: మహిళకు అరుదైన ఆపరేషన్ చేసిన ఢిల్లీ వైద్యులు.. 30 ఏళ్ల తరువాత పూర్తిగా నోరు తెరిచిన బాధితురాలుTelugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...
Anasuya bharadwaj: ‘ఆంజనేయస్వామి మా ఇంటికి వచ్చారు’.. కొత్త ఇంట్లో అనసూయ ఎమోషనల్ఇంటర్నెట్డెస్క్: యాంకర్గా, నటిగా వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న అనసూయ (Anasuya Bharadwaj) కొత్...
Ipl 2025: మే 17 నుంచి ఐపీఎల్ పునః ప్రారంభం.. జూన్ 3న ఫైనల్ఇంటర్నెట్ డెస్క్: భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ను బీసీసీఐ వాయిదా వేసిన సంగతి...