Stock market: నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@24,800
Stock market: నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@24,800"
Play all audios:
Stock Market Opening Bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలే దీనికి కారణంగా నిలిచాయి. దీంతో ఫ్లాట్గా ప్రారంభమై లాభాల్లో
ట్రేడయిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 164 పాయింట్ల నష్టంతో 81,386 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 16 పాయింట్ల నష్టంతో 24,809
వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో.. ఐటీసీ, టైటాన్, నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎటర్నల్, మారుతీ సుజుకీ, ఎల్అండ్టీ, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, హెచ్యూఎల్, పవర్గ్రిడ్
కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రా టెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ,
బజాజ్ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 64.49 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,293 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో
ముగిశాయి. నాస్డాక్ 2.47 శాతం, ఎస్ అండ్ పీ 500.. 2.05 శాతం, డోజోన్స్ 1.78 శాతం పెరిగాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియన్ ఏఎస్ఎక్స్, జపాన్ నిక్కీ
ఫ్లాట్గా ఉండగా.. హాంగ్సెంగ్, షాంఘై నష్టాల్లో కదలాడుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.348 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు
(DIIs) నికరంగా రూ.10,105 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.
Trending News
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగుసోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...
కాస్ట్లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్పామ్ శుద్ధి ప్...
Latests News
Stock market: నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@24,800Stock Market Opening Bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్ర...
Ipl 2025: వైభవ్ సూర్యవంశీకి 500 ఫోన్కాల్స్ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2025 సీజన్లో అరంగేట్రం చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తాను ఆడిన...
40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలి..విజయవాడ: రాష్ట్రంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టడమే అజెండాగా పెట్టుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై గన్నవరం ఎమ్మెల్యే వ...
Rajnath singh: ‘అమ్కా’ తయారీ దిశగా.. రక్షణ శాఖ కీలక ప్రకటనఅడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లను (అమ్కా) ఎగ్జిక్యూషన్ మోడల్ సిద్ధం చేయడానికి కేంద్ర రక్షణశాఖ ఆమోదం తెల...
Trump: వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు: చైనా విద్యార్థులను ఉద్దేశించి ట్రంప్Trump-China: చైనా విద్యార్థుల విషయంలో అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో చేసిన ప్రకటనకు భిన్నంగా ట్రంప్ స్పందించార...