Us tariffs: అమెరికా సుంకాల ప్రతికూల ప్రభావాన్ని తట్టుకునే స్థితిలో భారత్‌: మూడీస్‌

Eenadu

Us tariffs: అమెరికా సుంకాల ప్రతికూల ప్రభావాన్ని తట్టుకునే స్థితిలో భారత్‌: మూడీస్‌"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా సుంకాల (US tariffs) ప్రభావం, ప్రపంచ వాణిజ్య అంతరాయాల ప్రతికూలతలను తట్టుకునే స్థితిలోనే భారత్‌ ఉందని ప్రముఖ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ (Moody's Ratings)


తెలిపింది. దేశీయ వృద్ధికి ప్రోత్సాహకాలు, ఎగుమతులపై తక్కువ ఆధారపడటం తదితర అంశాలే అందుకు కారణమని వివరించింది. భారత్‌లో తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి, ప్రైవేట్‌ వినియోగాన్ని పెంచడానికి,


మౌలిక సదుపాయాల కల్పనపై వ్యయాన్ని పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు దోహదం చేస్తున్నాయని మూడీస్‌ వెల్లడించింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, ఆర్థిక వ్యవస్థను మరింత ప్రోత్సహించడానికి వడ్డీ


రేట్ల తగ్గింపు లాంటి చర్యలు చేపడుతోందని తెలిపింది. ‘‘అమెరికా సుంకాలు, ప్రపంచ వాణిజ్య అంతరాయాలను ఎదుర్కోవడానికి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే.. భారత్‌ మెరుగైన స్థానంలో ఉంది.  దీనికి


బలమైన అంతర్గత వృద్ధి, గణనీయమైన దేశీయ ఆర్థిక వ్యవస్థ, ఇతర దేశాలపై తక్కువ ఆధారపడటం వంటివి దోహదం చేస్తున్నాయి’’ అని మూడీస్‌ తన నివేదికలో పేర్కొంది. మౌలిక సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం చేసే వ్యయం


జీడీపీ వృద్ధికి దోహదపడుతుందని.. అదే సమయంలో వ్యక్తిగత ఆదాయ పన్ను కోతలు.. వినియోగాన్ని పెంచుతాయని మూడీస్‌ (Moody's Ratings) వెల్లడించింది. * అమెరికా రక్షణకు బంగారు కవచం.. ఏమిటీ గోల్డెన్‌


డోమ్‌..? ఇక ఇటీవల సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు (Pakistan-India tensions).. భారత్‌ కంటే పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థపైనే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయని మూడీస్‌ వెల్లడించింది.


‘‘పాకిస్థాన్‌తో భారత్‌కు ఆర్థిక సంబంధాలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. సరిహద్దుల్లో ఉద్రికత్తలు పెరిగినప్పటికీ.. భారత ఆర్థిక కార్యకలాపాలకు పెద్ద అంతరాయాలు ఉండవని మేం ఆశిస్తున్నాం. మరోవైపు


భారత్‌లోని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఎక్కువ ఉత్పత్తి చేసే ప్రాంతాలు ఘర్షణ ప్రాంతాలకు దూరంగా ఉన్నాయి’’ అని మూడీస్‌ వివరించింది. అయితే అధిక రక్షణవ్యయం భారత ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపే


అవకాశం ఉందని తెలిపింది. వాణిజ్య చర్చలు ఫలవంతమైతే భారత ఉత్పత్తులు అమెరికాకు భారీగా ఎగుమతి అవుతాయని అంచనా వేసింది.


Trending News

Technology | latest tech news today - eenadu

ఐఫోన్‌ డేటా బదిలీ సులువుగా.. కొత్త ఐఫోన్‌ కొన్నారా? పాత ఐఫోన్‌ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకోవాలని అనుకుంటున్నారా? థర్డ్...

India operations: ఆపరేషన్‌ ‘మేఘ్‌దూత్‌ నుంచి సిందూర్‌’ వరకు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూకశ్మీర్‌పై దశాబ్దాలుగా వివాదాన్ని కొనసాగిస్తున్న పాకిస్థాన్‌ (Pakistan).. సీమాంతర ఉగ్రవాదాన్ని ...

సేవా సైనికులు.. మీకు సెల్యూట్‌: సీఎం ‌జగన్‌

సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులు పొందిన వలంటీర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ వలంటీర్ల సేవా దృక్పథం, మంచి చేయాలన్న తపనన...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

రాజమండ్రిలో రుచి చూసిన జైలు జీవితం

ఆనం కళాకేంద్రంలో రావి కొండలరావును సన్మానిస్తున్న జిత్‌ మోహన్‌ మిత్రా(ఫైల్‌) _ఆయనో సినీ విజ్ఞాని. స్క్రీన్‌ప్లే, కథ, కథనా...

Latests News

Us tariffs: అమెరికా సుంకాల ప్రతికూల ప్రభావాన్ని తట్టుకునే స్థితిలో భారత్‌: మూడీస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా సుంకాల (US tariffs) ప్రభావం, ప్రపంచ వాణిజ్య అంతరాయాల ప్రతికూలతలను తట్టుకునే స్థితిలోనే భారత్...

Govt jobs 2023: నిరుద్యోగులకు అలర్ట్.. ఈ 3 వేల ఉద్యోగాలకు అప్లై చేశారా?

Published by: Last Updated:April 30, 2023 10:26 PM IST నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఢిల్లీలోని ప్రముఖ ఆల్ ఇండియా ఇన్ స్టిట...

ఆ కోళ్లు కాసులు కురిపిస్తున్నాయి..

రాజశ్రీ రకం కోళ్లు విజయనగరం ఫోర్ట్‌: అందరికీ ఉద్యో గాలు అసాధ్యం. పంట పండించాలంటే ఎంతోకొంత పొలం ఉండాలి. ఇవే వీ లేని యువతక...

Talasani srinivas yadav | latest talasani srinivas yadav - eenadu

ఆ పరిశ్రమ తలసాని కుటుంబానిదే.. మంత్రి సీతక్క ఆరోపణ నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ పరిశ్రమ భారాసకు చెందిన మాజీ మంత...

కరోనా కల్లోలం : రూపాయి పతనం

సాక్షి, ముంబై : ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థలను  అతలాకుతలం చేస్తోంది. లాక్ డౌన్ ...

Top